‘దైవసాక్షి’గా పవన్‌ కల్యాణ్‌ ప్రమాణం చేసి నేటితో ఏడాది

జనసేన పార్టీ పవన్‌ కల్యాణ్‌ మీద స్పెషల్‌ వీడియోను విడుదల చేసింది.;

Update: 2025-06-12 09:52 GMT

జూన్‌ 12 గురువారంతో ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయింది. పవన్‌ కల్యాణ్‌ అనే నేను.. అంటూ దైవ సాక్షిగా కొణిదెల పవన్‌ కల్యాణ్‌ ప్రమాణం స్వీకారం చేసి నేటితో సంవత్సరం పూర్తి అయింది. సరిగ్గా జూన్‌ 12న పవన్‌ కల్యాణ్‌ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ పవన్‌ కల్యాణ్‌తో ప్రమాణం చేయించారు. గన్నవరం సమీపంలో జరిగిన ప్రమాణ స్వీకారోత్సంలో తొలి సారి గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్న పవన్‌ కల్యాణ్‌ ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. సీఎం చంద్రబాబుతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, తన అన్నయ్య చిరంజీవి కాళ్లకు మొక్కి తన సంతోషాన్ని పంచుకున్నారు.

జనసేన పార్టీకి తొలి సారి అసెంబ్లీలో ప్రాతినిద్యం లభించడం, ఏకంగా ఉప ముఖ్యమంత్రి స్థానాన్ని దక్కించుకోవడం వంటి అరుదైన సందర్భం నేపథ్యంలో జనసేన పార్టీ ఒక ప్రత్యేక వీడియోను రిలీజ్‌ చేసింది. జనసేన పార్టీ ఆవిర్భావంతో పాటు జనసేన పార్టీ ఏర్పడిన నాటి నుంచి ఎదుర్కొన్న కష్ట, నష్టాలు వంటి ఘట్టాలను చూపిస్తూ వీడియోను రూపొందించారు. దీనిలో పవన్‌ కల్యాణ్‌ ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భాన్ని కూడా వీడియోలో చిత్రీకరించారు. ఏడాది సందర్భగా ఈ వీడియోను జనసేన పార్టీ తన సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది.

Tags:    

Similar News