వంద శాతం విజయానికి ఏడాది

2024 జూన్‌ 4 భారత దేశ రాజకీయ చరిత్రలో నిలిచిపోయే రోజు అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు.;

Update: 2025-06-04 07:42 GMT

జనసేన పార్టీ వంద శాతం స్ట్రైక్‌ రేట్‌ విజయవానికి జూన్‌ 4 బుధవారంతో ఏడాది పూర్తి అయిందని ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి జూన్‌ 4 బుధవారంతో సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు.

పవన్‌ కల్యాణ్‌ ఏమన్నారంటే..
ప్రజా తీర్పుకు ఏడాది...ప్రజా చైతన్యానికి ఏడాది... ప్రజాస్వామ్య పరిరక్షణకు ఏడాది...ఎన్డీఏ కూటమి చారిత్రక విజయానికి ఏడాది... జనసేన పార్టీ 100% స్ట్రైక్‌ రేట్‌ విజయానికి ఏడాది... 04–06–2024 ఇది భారతదేశ రాజకీయ చరిత్రలో నిలిచిపోయే రోజు. 5 ఏళ్ల అరాచక పాలనను తరిమికొట్టి, నిరంకుశ ఫ్యూడలిస్టిక్‌ కోటలను ప్రజలు తమ ఓటు హక్కుతో బద్దలుకొట్టి, ప్రజాస్వామ్య పరిరక్షణకు నాంది పలికిన రోజు. దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న నవ భారత్‌ నిర్మాత ప్రధాని నరేంద్ర మోదీ దృఢమైన నాయకత్వం, నాలుగున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం, ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొని ప్రజాక్షేత్రంలో దృఢంగా నిలచిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో, దశాబ్ద కాలంగా ఎన్నో పోరాటాలు చేసి, మరెన్నో దాష్టికాలను తట్టుకుని, అడ్డుగోడగా నిలచిన జనసైనికులు, వీరమహిళల పోరాట స్పూర్తి, వ్యవస్థలో మార్పు తీసుకురావాలనే జనసేన పార్టీ సంకల్పానికి ప్రజలు అండగా నిలిచి చారిత్రాత్మక విజయాన్ని అందించిన రోజు.
మీరు ఇచ్చిన తీర్పును బాధ్యతగా తీసుకున్నాం. గత తప్పిదాలను సరిచేస్తూ, భావి తరాలకు బంగారు భవిష్యత్తు అందించేలా, రాష్ట్రాన్ని స్వర్ణ ఆంధ్ర 2047 దిశగా నడిపించేందుకు, వికసిత్‌ భారత్‌ 2047 లో కీలక భాగస్వామిగా అయ్యేందుకు ఉమ్మడి ప్రణాళికతో, రాజకీయాలకు అతీతంగా ఆంధ్రప్రజల ఆకాంక్షలే లక్ష్యంగా ‘జనసేన పార్టీ – తెలుగుదేశం – బీజేపీ‘ పార్టీల ఎన్టీఏ కూటమి ప్రభుత్వం ప్రజా పరిపాలనను అందిస్తుంది. రానున్న రోజుల్లో మరింత సమర్థవంతమైన పరిపాలన అందిస్తామని, సంక్షేమాభివృద్ధి సాధించేలా మరింత బాధ్యతతో కృషి చేస్తామని తెలియజేస్తున్నాను. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన జనసైనికులకు, వీరమహిళలకు, కార్యకర్తలకు, మూడు పార్టీల నాయకులకు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటూ ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు.

Tags:    

Similar News