ఎవరు అడ్డొచ్చినా తొక్కుకుంటూ పోతా
మద్యం ఆదాయంలో 2 శాతం గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు ఖర్చు చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు.;
ఆంధ్రప్రదేశ్లో గంజాయి, డ్రగ్స్ మీద యుద్ధాన్ని ప్రకటిస్తున్నట్లు సీఎం చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్లో గంజాయిని, డ్రగ్స్ను కట్టడి చేసే విషయంలో ఎవరు అడ్డొచ్చినా తొక్కుకుంటూ పోతామని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. యాంటీ నార్కోటిక్స్ డే సందర్భంగా గురువారం గుంటూరులో నిర్వహించిన వాకథాన్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు, యువతే ప్రధాన లక్ష్యంగా గుంటూరు శ్రీకన్వెన్షన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం మాట్లాడారు.
గంజాయిని, డ్రగ్స్ను అరికట్టడంలో గత జగన్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో వైఫల్యం చెందిందని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా గంజాయి బ్యాచ్లకు సహకరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో గంజాయిని అరికట్టాల్సిన బాధ్యత కేవలం ప్రభుత్వానిదే కాదని, దీనిలో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలన్నారు. ప్రతిపక్షాలు కూడా భాగస్వామ్యం కావాలన్నారు. అందరు కలిసి అడుగు ముందుకేసి గంజాయిని నిర్మూలనకు కృషి చేద్దామన్నారు.