కాకాణికి నో బెయిల్
అక్రమ మైనింగ్కు పాల్పడ్డారని కాకాణి గోవర్థన్రెడ్డి మీద నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీసులు కేసు నమోదు చేశారు.;
మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక సీనియర్ నాయకుడు కాకాణి గోవర్థన్రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చుక్క ఎదురైంది. నెల్లూరు జిల్లాలో అక్రమ మైనింగ్ తవ్వకాలకు పాల్పడినట్టు తనపై అక్రమ కేసులు పెట్టారని, అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారని, ఈ అరెస్టుల నుంచి తనను రక్షించాలని కోరుతూ కాకాణి గోవర్థన్రెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. తొందరపడి తనను అరెస్టు చేయకుండా పోలీసులను ఆదేశించాలని, పోలీసులు తనపై పెట్టిన కేసులను కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపైన సోమవారం విచారణ చేపట్టిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కాకాణి గోవర్థన్రెడ్డికి రక్షణ కల్పించేందుకు నిరాకరించింది. తన మీద పోలీసులు పెట్టిన కేసును కొట్టివేయాలంటూ కాకాణి దాఖలు చేసుకున్న క్వాష్ పిటీషన్పై విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. బెయిల్ మంజూరు చేసేందుకు హైకోర్టు తిరస్కరించింది.