కోర్టుకు ఎంపీ మిథున్రెడ్డి..గేట్లు క్లోజ్ చేసిన పోలీసులు
వైసీపీ ఎంపీ మిథున్రెడ్డి శనివారం సిట్ విచారణకు హాజరయ్యారు.;
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో అరెస్టు అయిన వైఎస్ఆర్కాంగ్రెస్పార్టీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డిని సిట్ అధికారులు ఆదివారం మధ్యాహ్నం విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశ పెట్టారు. అంతకు ముందు సిట్ కార్యాలయం నుంచి మిథున్రెడ్డిని విజయవాడ జీజీహెచ్కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీ, షుగర్, ఈసీజీ తదితర వైద్య పరీక్షలు నిర్వహించారు. రిపోర్టులన్నింటినీ పరిశీలించిన జీజీహెచ్ వైద్యులు మిథున్రెడ్డికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని నిర్థారించారు. అనంతం అక్కడ నుంచి విజయవాడ ఏసీబీ కోర్టుకు తరలించి కోర్టు ముందు ప్రవేశపెట్టారు. గత ప్రభుత్వ హయాంలో రూపొందించిన మద్యం పాలసీలో ఎంపీ మిథున్రెడ్డి పాత్ర కూడా కీలకంగా ఉందని, ఈ నేపథ్యంలో మిథున్రెడ్డికి రిమాండ్ విధించాలని పోలీసులు కోర్టును కోరనున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ మిథున్రెడ్డికి ఏసీబీ కోర్టు రిమాండ్ విధించే అవకాశాలు ఉన్నాయని పోలీసు వర్గాలు చర్చించుకుంటున్నారు.