పంచాయతీరాజ్‌ శాఖపై ఎక్కువ ఖర్చు చేయాలి

మూలధన వ్యయానికి మరింత ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు.;

Update: 2025-06-26 09:56 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబు మరో సారి తన మిత్రుడు, కూటమిలో కీలక భాగస్వామి, జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ మీద తన ప్రేమను చూపించారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సారధ్యం వహిస్తున్న పంచాయతీరాజ్‌ శాఖకు అవసరమైన నిధులు మంజూరుకు శాఖాపరమైన సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అదేశించారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ శాఖ అయిన పంచాయతీరాజ్‌ శాఖపై ఎక్కువ ఖర్చు చేయాలని, దానికి కావలసిన నిధులను నాబార్డ్‌ నుంచి సేకరించాలని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ఆ శాఖ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.

రాష్ట్ర ఆర్థిక శాఖపై క్యాంప్‌ కార్యాలయంలో మంత్రి పయ్యావుల కేశవ్, ఆర్థిక శాఖ అధికారులతో గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఆర్థిక శాఖ స్థితిగతులు, రాబడులు, ఖర్చులపై ఈ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ఆ శాఖ అధికారులతో చర్చించారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల ఖర్చు, నిధుల విడుదల. నిధుల సేకరణపై సమీక్షించారు.
పింఛన్లతో సహా సంక్షేమ కార్యక్రమాలకు ప్రతినెలా వెచ్చిస్తున్న ఖర్చతో పాటు....రానున్న రోజుల్లో వివిధ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాల కోసం ఖర్చు చేయాల్సిన నిధులపైనా.. ఆయా కార్యక్రమాల అమలుకు అవసరమైన నిధుల లభ్యతకు సంబంధించిన అంశాలపై సీఎం చంద్రబాబు చర్చించారు. కేంద్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాల కింది ఇచ్చే నిధులను మూలధన వ్యయానికి ఖర్చు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. సంక్షేమ పథకాలతో పాటు.. సంపద సృష్టికి, రెవెన్యూ జనరేషన్‌కు కారణం అయ్యే మూలధన వ్యయం మరింత పెంచాలని ఆదేశించారు. అలా సంపద సృష్టికి, రెవెన్యూ జనరేషన్‌కు తోడ్పడే ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఆ శాఖ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.
Tags:    

Similar News