వంగవీటి రాధా ఇంటికెళ్లిన మంత్రి లోకేష్‌ పరామర్శ

వైసీపీకి చెందిన పలువురు కాపు నాయకులు టీడీపీని కాదని జనసేనలో చేరుతున్న నేపథ్యంలో మంత్రి లోకేష్‌ వంగవీటి రాధాను కలవడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.

Update: 2024-10-22 12:47 GMT

టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాను మంత్రి లోకేష్‌ కలిశారు. వంగవీటి రాధాకృష్ణ ఇటీవల అస్వస్థతకు గురయ్యారు. హార్ట్‌కు సంబంధించిన సమ్యతో ఇబ్బంది పడ్డారు. ప్రస్తుతం ఆయన కోలుకొని రెస్టు తీసుకుంటున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ మంగళవారం వంగవీటి రాధా ఇంటికి వెళ్లి పరామర్శించారు. అరోగ్య పరిస్థితిన అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్న మంత్రి లోకేశ్‌ తాడేపల్లి పాతూరులోని వంగవీటి రాధా ఇంటికి స్వయంగా వెళ్లి ఆయనను పరామర్శించారు. రాధా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా లోకేష్ వంగవీటి రాధా కుటుంబ సభ్యులతోనూ ఆత్మీయంగా ముచ్చటించారు. లోకేశ్‌ తమ ఇంటికి వచ్చి పరామర్శించడం పట్ల వంగవీటి రాధా కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన పలువురు కాపు నాయకులు టీడీపీని కాదని జనసేనలో చేరుతున్న నేపథ్యంలో మంత్రి లోకేష్‌ వంగవీటి రాధాను కలవడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.

Tags:    

Similar News