సూత్రదారి సజ్జలేనా
నేడు సీఐడీ విచారణకు సజ్జల రామకృష్ణారెడ్డి, దేవినేని అవినాష్లు హాజరు కానున్నారు.;
వైసీపీ ప్రభుత్వ హయాంలో కీలకంగ వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి కనుసన్నుల్లోనే మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగింది. దీని వెనుక ప్లాన్ వేసింది. అమలయ్యేలా చేసింది, దాడికి సూత్రదారి సజ్జల రామకృష్ణారెడ్డే అని సీఐడీ తేల్చింది. ఈ నేపధ్యంలో విచారణకు హాజరు కావాలని సీఐడీ అధికారులు సజ్జల రామకృష్ణారెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఆయనతో పాటు విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజక వర్గం వైసీపీ ఇన్చార్జి దేవినేని అవినాష్కు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు గుంటూరు సీఐడీ కార్యాలయంలో నిర్వహించే విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో సజ్జల రామకృష్ణారెడ్డి, దేవినేని అవినాష్లను ఆదేశించారు. ఈ మేరకు ఇరువురు నేతలు శుక్రవారం ఉదయం 11 గంటలకు గుంటూరు సీఐడీ కార్యాలయంలో నిర్వహించే విచారణకు హాజరు కానున్నారు.