ఎరువులు దారి మళ్లకుండా చూడండి

యూరియా,డిఏపి ఎరువుల నిల్వలు సరిపడా ఉన్నాయని, రైతులు ఆందోళనలు చెందొద్దని సీఎస్‌ విజయానంద్‌ స్పష్టం చేశారు.;

Update: 2025-08-07 15:39 GMT

యూరియా, డీఏపీ ఎరువులను దారిమళ్ళించకుండా గట్టి చర్యలు తీసుకోవాలని, దీని కోసం ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే విజయానంద్‌ వ్యవసాయ శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో ప్రస్తుతం రైతుల అవసరాలకు సరిపడా యూరియా, డిఏపి ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని, కావున రైతులెవ్వరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుండి ఆయన వ్యవసాయశాఖ అధికారులు, జిల్లా కలెక్టర్లతో ఎరువుల అంశంపై వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో ఆగష్టు మాసానికి లక్షా 65 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరం కాగా, ప్రస్తుతం క్షేత్ర స్థాయిలో 2లక్షల 4వేల మెట్రిక్‌ టన్నుల యూరియా అందుబాటులో ఉందని అన్నారు. అదే విధంగా డిఏపి 70 వేల మెట్రిక్‌ టన్నులు అవసరం ఉండగా, ప్రస్తుతం 88 వేల 248 మెట్రిక్‌ టన్నులు అందుబాటులో ఉందని, అందువల్ల రైతులు ఎవరూ కూడా ఎరువుల కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సిఎస్‌ పేర్కొన్నారు.

అయితే సబ్సిడైజ్డ్‌ యూరియాను అనగా ఎజియు(అగ్రిగ్రేడ్‌ యూరియా)పారిశ్రామిక అవసరాలకు అనగా ఫ్లైఉడ్, పెయింట్స్, యాడ్‌ బ్లూ మాన్యుప్యాక్చరింగ్, పశు, కోళ్ళ పరిశ్రమల యూనిట్లు, ఆక్వా రైతులు దానా కోసం వినియోగించేందుకు వాటిని దారి మళ్ళించ కుండా ఉండేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను సీఎస్‌ విజయానంద్‌ ఆదేశించారు. ఇందుకు సంబంధించి జిల్లా స్థాయిలో వ్యవసాయ సంబంధిత శాఖల అధికారులతో వెంటనే కోఆర్డినేషన్‌ సమావేశం నిర్వహించి రైతులకు పూర్తి స్థాయిలో ఎరువులు అందుబాటులో ఉండే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆకస్మిక తనిఖీలు చేపట్టి యూరియా దారి మళ్ళకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
అనంతరం అన్నధాత సుఖీభవ–పియం కిసాన్‌ కు సంబంధించి ఎన్పిసిఐ ఇన్‌ యాక్టివ్, ఈ–కెవైసి మ్యాపింగ్‌ కాని రైతుల ఖాతాలను వేగవంతంగా మ్యాపింగ్‌ ప్రక్రియను పూర్తి చేసి అర్హులైన రైతులందరికీ ఆనిధులు జమ అయ్యేవిధంగా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలక్టర్లను సిఎస్‌ విజయానంద్‌ ఆదేశించారు.
Tags:    

Similar News