లిక్కర్‌ స్కాం క్షమించరాని నేరం

వైసీపీ హయాంలో పెద్ద ఎత్తున మద్యం కుంభకోణం జరిగిందని మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ అన్నారు.;

Update: 2025-05-12 12:13 GMT

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం కుంభకోణం క్షమించరాని నేరమని మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ అన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున లిక్కర్‌ స్కాం జరిగిందని సత్యకుమార్‌ ఆరోపించారు. ఒక ప్రభుత్వ అధినేతగా ఉన్న ముఖ్యమంత్రి ఆధ్వర్వంలోనే సొంతంగా డిస్టలరీలు ఏర్పాటు చేసి లిక్కర్‌ స్కాంకు పాల్పడటం బాధాకరమని, ఇలాంటిది ఎక్కడ జరగలేదని, వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిందని ఆయన ఆరోపించారు.

సోమవారం ఆయన విజయవాడలో మాట్లాడుతూ.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్‌ స్కాం వల్ల, కల్తీ మద్యం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో కాలేయ, కిడ్నీ సంబంధిత వ్యాధులు పెరిగి పోయాయన్నారు. రాష్ట్ర విభజన అనంతరం 2014–19 కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో 49వేల కిడ్నీ కేఉలు నమోదయ్యాయన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019–24 మధ్య కాలంలో 91వేలకు కిడ్నీ కేసులు పెరిగాయిని, అదేవిధంగా కాలేయ సంబంధిత కేసులు కూడా విపరీతంగా పెరిగాయాన్నారు. వీటితో పాటుగా న్యూరో సంబంధిత కేసులు కూడా 380 నుంచి 7,800 వరకు పెగినట్లు మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ తెలిపారు.

అంతేకాకుండా వైసీపీ హయాంలో నాసిరకం మద్యం, కల్తీ మద్యం కారణంగా లక్షలాది మంది ప్రాణాలతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెలగాటం ఆడారని విమర్శించారు. నాడు సీఎంగా ఉన్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సొంత బ్రాండ్లు తయారు చేయించడం విడ్డూరంగా ఉందని, ప్రపంచంలో ఎక్కడా ఇలాంటిది చూడలేదన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో జరిగిన లిక్కర్‌ స్కాంలో వేల కోట్ల అవినీతి జరిగిందని మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ ఆరోపించారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా అత్యున్నత సేవలు అందించిన నర్సులకు ఫ్లోరెన్స్‌ నైటింగేల అవార్డులను అందజేశారు.

Tags:    

Similar News