ఈ సంస్థలకు అమరావతిలో భూ కేటాయింపులు

ప్రభుత్వం నిర్ణయించిన టైమ్‌బాండ్‌ ప్రకారం నిర్మాణాలు చేపట్టని పక్షంలో ఆ భూములను వెనక్కి తీసుకుంటామని మంత్రి నారాయణ తెలిపారు.;

Update: 2025-06-23 10:46 GMT

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో నాలుగు నుంచి ఆరు నెలల్లో నిర్మాణ పనులు ప్రారంభించకపోతే ఆ సంస్థలకు ప్రభుత్వం కేటాయించిన భూములను తిరిగి వెనక్కి తీసుకుంటామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. అమరావతి ప్రాంతంలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై మంత్రి వర్గ ఉపసంఘం సోమవారం భేటీ అయ్యింది. మంత్రులు నారాయణ, భరత్, పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్‌లు, అధికారులు సమావేశానికి హాజరయ్యారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ.. మొత్తం 16 అంశాలకు సంబంధించి చర్చలు జరిగగా, వీటిల్లో 12 అంశాలకు సంబంధించిన నిర్ణయాలను మంత్రివర్గ ఉప సంఘంలో ఆమోదం పొందినట్లు వెల్లడించారు. 2014– 19 మధ్య కాలంలో అమరావతిలో భూములు కేటాయించిన వాటిల్లో నాలుగు సంస్థలకు భూ కేటాయింపులు కొనసాగించాలనే నిర్ణయానికి కేబినెట్‌ సబ్‌కమిటీ ఆమోదం తెలిపినట్లు చెప్పారు.

సెంటర్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్విసిగేషన్‌ కు రెండు ఎకరాలు కేటాయింపు కొనసాగిస్తూ ఆమోదించింది. జులాజీకల్‌ ఆఫ్‌ సర్వే ఆఫ్‌ ఇండియా సంస్థకు రెండు ఎకరాలు కేటాయింపును కొనసాగిస్తూ ఆమోదం తెలిపింది. స్టేట్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ కు ఐదు ఎకరాలు కేటాయింపు కొనసాగిస్తూ ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్‌ కోపరేటివ్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌కు మూడు ఎకరాలు కేటాయింపును కొనసాగిస్తూ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అయితే ఈ నాలుగు సంస్థలకు గతంలో కేటాయించిన భూ కేటాయింపులను రివైజ్‌ చేసి ఆమోదం తెలిపినట్లు మంత్రి నారాయణ తెలిపారు. 2014– 19లో కేటాయించిన రెండు సంస్థలకు భూ కేటాయింపులను రద్దు చేసినట్లు మంత్రి నారాయణ చెప్పారు.
గెయిల్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్, అంబికా అగర్బత్తికి భూ కేటాయింపులను రద్దు చేశామన్నారు. ఈ సారి కొత్తగా ఆరు సంస్థలకు భూ కేటాయింపులు చేశామన్నారు. గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌కు రెండు ఎకరాలు కేటాయించాలని నిర్ణయించామన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ బ్యాంక్‌ కు రెండు ఎకరాలు, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కు 0.4 ఎకరాలు, ఇంటిలిజెన్స్‌ బ్యూరో ( ఐబీ)కి 0.5 ఎకరాలు, బ్యూరో ఆఫ్‌ ఇమిగ్రేషన్‌కి 0.5 ఎకరాలు, బిజెపి పార్టీకి రెండు ఎకరాల చొప్పున కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు.
అయితే భూములు కేటాయించిన సంస్థలకు టైమ్‌ లైన్‌ ప్రకారం నిర్మాణం చేపట్టాల్సి ఉంటుందన్నారు. 2014– 2019 కాలంలో 130 సంస్థలకు 1270 ఎకరాలు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. అయితే భూములు కేటాయించిన వాటిల్లో కొంతమంది మాత్రమే నిర్మాణాలు చేపట్టారని, గత ప్రభుత్వం చేసిన నిర్వాకం వలన మిగిలినవారు ఎవరు నిర్మాణాలకు ముందుకు రాలేదన్నారు. అయితే తమ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత పలు సంస్థలు భూములు కేటాయించాలని దరఖాస్తులు చేసుకున్నట్లు తెలిపారు. వీటిల్లో 64 సంస్థలకు 884 ఎకరాలు భూ కేటాయింపులకు చేశామని, సోమవారం మరో పది సంస్థలకు భూ కేటాయింపులు చేసినట్లు తెలిపారు. ఇది వరకు 2014–19 మధ్య కాలంలో కేటాయించిన సంస్థలకు టైం బాండ్‌ ముగిసిందని, వీటికి సంబంధించి మంత్రివర్గ ఉప సంఘంలో మరోసారి చర్చించి రివైజ్‌ చేసుకుంటూ భూ కేటాయింపులు చేసుకుంటూ వస్తున్నట్లు తెలిపారు.
భూములు కేటాయించిన సంస్థలకు నిర్మాణాలు చేపట్టేందుకు నాలుగు నుంచి ఆరు నెలలు సమయం కేటాయించామనారు. పనులు ప్రారంభించేందుకు ఆ సంస్థల నుంచి టైం షెడ్యూల్‌ కూడా తీసుకున్నట్లు తెలిపారు. రాబోయే రెండు మూడు నెలల్లో అన్ని సంస్థలు నిర్మాణాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. అయితే ప్రభుత్వం నిర్ణయించిన టైం బాండ్‌ ప్రకారం నిర్మాణాలు చేపట్టకపోతే భూములు రద్దు చేస్తామని వెల్లడించారు. అమరావతిలో ఇప్పటి వరకు పిలిచిన అన్ని టెండర్స్‌ కు పనులు మొదలైనట్లు చెప్పారు. ప్రస్తుతం 10,000 మంది పైగా కార్మికులు అమరావతిలో పనిచేస్తున్నట్లు చెప్పారు. వచ్చే నెల చివరి నాటికి 20 వేల మంది కార్మికులు పనిచేయటానికి అందుబాటులోకి వస్తారని మంత్రి నారాయణ వెల్లడించారు. 
Tags:    

Similar News