బెయిల్ పై కొమ్మినేని శ్రీనివాసరావు విడుదల
సాక్షి టీవీ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు సోమవారం సాయంత్రం 7 గంటలకు గుంటూరు జైలు నుంచి బెయిల్ పై విడుదలయ్యారు.;
అమరావతి ఉన్న మహిళలు వేశ్యలంటూ సాక్షి టీవీ చర్చ కార్యక్రమంలో మాట్లాడిన జర్నలిస్ట్ కృష్ణంరాజు, యాంకర్ గా వ్యవహరించిన కొమ్మినేని శ్రీనివాసరావులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసులో కొమ్మినేనిని పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. కోర్టు రిమాండ్ విధించింది. సుప్రీకోర్టు బెయిల్ శుక్రవారం మంజూరు చేసినా శని, ఆదివారాలు సెలవులు కావడంతో బెయిల్ కాగితాలు కోర్టు నుంచి జైలు అధికారులకు మూడు రోజులుగా అందలేదు.
సోమవారం సాయంత్రానికి జైలు అధికారులు బెయిల్ కాగితాలు అందుకున్నారు. దీంతో సాయంత్రం ఆయన విడుదలయాయరు. జైలు వద్దకు గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు, కొందరు జర్నలిస్టులు వెళ్లి ఆనతో పాటు కలిసి వచ్చారు. జైలు గేటు నుంచి బయటకు రాగానే రాంబాబును కొమ్మినేని ఆలింగనం చేసుకున్నారు. ఆ సమయంలో కాస్త ఉద్వేగానికి గురయ్యారు.