బెయిల్ వచ్చి రెండు రోజులైనా కొమ్మినేని జైలులోనే... కారణం ఏంటంటే?
ఎవరి ఆలస్యం;
అమరావతి మహిళలపై అసభ్య వ్యాఖ్యలు కేసులో అరెస్ట్ అయ్యి జైలు లో వున్న సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు బెయిల్ వచ్చినా రెండు రోజులుగా జైలులోనే వున్నారు. కొమ్మినేని కి శుక్రవారం సుప్రీం కోర్టు బెయిల్ ఇచ్చింది. వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది.సుప్రీంకోర్టు తీర్పు కాపీ వచ్చిన వెంటనే ప్రక్రియ పూర్తి చేసి అదే రోజు కొమ్మినేనిని విడుదల చేయించాల్సింది ఉంది.
కానీ ఢీల్లీలోనే ఉన్న వైసీపీ లాయర్లు సుప్రీంకోర్టు తీర్పు కాపీని వెంటనే తీసుకోలేక పోయారు.
ఫలితంగా ఆ తీర్పు కాపీ సాయంత్రం ఎప్పుడో అందింది. ఆ రోజుకు సమయం ముగిసిపోయింది. అయితే తరువాత రోజు రెండవ శనివారం, ఆ తరువాత ఆదివారం తో కొమ్మినేని బెయిల్ వచ్చినా రెండు రోజులుగా జైలు లోనే వున్నారు.శని, ఆదివారాలు వున్నాయని ముందే తెలిసినా వైసీపీ లాయర్లు బెయిల్ పేపర్లు తీసుకోవడంలో ఎందుకు ఆలస్యం చేశారో అర్థంకావడం లేదు.
ఇక సోమవారం మాత్రమే కొమ్మినేని విడుదల కావాలి.. కింది కోర్టు నుంచి బెయిల్ షరతుల్ని పొందాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కింది కోర్టు ఇప్పుడు బెయిల్ షరతులు పెట్టాల్సి ఉంది. ఆ ప్రక్రియ సోమవారం మధ్యాహ్ననికి గాని పూర్తయ్యే పరిస్థితి లేదు. అదీ ఆలస్యం అయితే సోమవారం కూడా జైలు లోనే వుండాల్సి వస్తుంది.మరోవైపు ఇదే కేసులో నిందితుడు గా జైలు లో వున్న కృష్ణంరాజు కు ఇంకా బెయిల్ రాలేదు. వైసీపీ లీగల్ టీం కృష్ణంరాజు కు సాయం చేయడం లేదని, ఆయన సొంతంగా లాయర్ ను పెట్టుకున్నట్లు తెలుస్తోంది.