గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ

జూలై 12న విజయవాడలో తమ సమస్యల పరిష్కారం కోసం వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగులు రాష్ట్ర స్థాయి ఆత్మగౌరవ సభను నిర్వహించనున్నారు.;

Update: 2025-06-14 14:41 GMT
విజయవాడలో జరిగిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమావేశంలో పాల్గొన్న నాయకులు

ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం విజయవాడలోని ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశం తీర్మానించింది. ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలపై 30 సంఘాలు కలిపి ఈ సమావేశం నిర్వహించాయి. ప్రధానంగా సీనియర్ అసిస్టెంట్ పేస్కేల్ అమలు చేయాలని, సర్వీస్ నిబంధనలు, స్పష్టమైన జాబ్ చార్ట్ లు అమలు, ప్రమోషన్లు, అంతర్ జిల్లా బదిలీలు, సొంత మండలంలో ఉద్యోగం చేసుకునే వెసులుబాటు కల్పించాలనే డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. ఈ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని వారు కోరారు. జూలై 12న విజయవాడలో జరుపుకునే మొట్ట మొదటి ఆత్మ గౌరవ సభను జయప్రదం చేయాలని గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులకు పిలుపు నిచ్చారు.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే స్వర్ణాంధ్ర 2047లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులందరినీ భాగస్వామిగా చేయాలని, మా సహకారాన్ని ప్రభుత్వానికి అందజేస్తానని సమావేశంలో తీర్మానించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు జి జోసెఫ్ కిషోర్, టి కోటేశ్వరరావు, టి ప్రభాకర్, వి శ్రీనివాస్, ఎం రాజ్యలక్ష్మి, టి దుర్గాప్రసాద్, పి నరసింహారావు, అప్పికట్ల కిషోర్, కె వి రాజేష్ బాబు, k s k వెస్లీ, జయకర్, మహబూబ్ బాషా, అనుషా, అనురాధ, షణ్ముక్, పి రాజు, దుర్గా ప్రసాద్, వెంకటేశ్వర్లు, రాజు, మజిమున్నిసా, తిరుమున్నిసా, సత్యనారాయణ, మొజెస్ పాల్గొన్నారు.

Tags:    

Similar News