జగన్‌ కేసు రేపటికి వాయిదా

రెంటపాళ్ల పర్యటనలో చీలి సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన కేసులో పోలీసులు జగన్‌ను నిందిడిగా చేర్చారు.;

Update: 2025-06-26 08:51 GMT

తన మీద పోలీసులు నమోదు చేసిన చీలి సింగయ్య మృతి కేసును కొట్టివేయాలంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దాఖలు చేసుకున్న క్వాష్‌ పిటీషన్‌పై విచారణను ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. బుధవారం జగన్‌ దాఖలు చేసుకున్న ఈ పిటీషన్‌ మీద గురువారం విచారణ చేపట్టిన ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు.. విచారణకు సమయం కావాలని కూటమి ప్రభుత్వం తరపున న్యాయవాదులు కోరడంతో ఈ కేసును శుక్రవారానికి వాదాయి వేసింది.

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల చేపట్టిన పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటనలో చీలి సింగయ్య మృతి చెందాడు. జగన్‌ ప్రయాణిస్తున్న కారు కిందపడి చీలి సింగయ్య అనే వ్యక్తి మరణించాడని ఆరోపణల మీద కారు డ్రైవర్‌ రమణారెడ్డిని ఏ1గాను, కారులో ఉన్న జగన్‌ను ఏ2గాను చేర్చుతూ పోలీసులు కేసు నమోదు చేశారు. వీరితో పాటు జగన్‌ కారులో ప్రయాణిస్తున్న మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజని, జగన్‌ పీఏ కేఎన్‌ఆర్‌లను కూడా నిందితులుగా చేర్చుతూ పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఈ నేపథ్యంలో జగన్‌ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును ఆశ్రయించారు. తన మీద పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని బుధవారం క్వాష్‌ పిటీషన్‌ దాఖలు చేశారు. జగన్‌తో పాటు ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజని, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, జగన్‌ ఏపీ కేఎస్‌ఆర్‌లు కూడా హైకోర్టులో క్వాష్‌ పిటీషన్లను దాఖలు చేశారు. వీటిపైన గురువారం హైకోర్టు విచారణ చేపట్టింది. అయితే విచారణకు సమయం కావాలని ప్రభుత్వం తరపున న్యాయవాదులు కోరారు. ఈ నేపథ్యంలో ఈ కేసును శుక్రవారానికి వాయిదా వేసింది.
రాజకీయ కక్షలతోనే తనను ఈ కేసులో ఇరికించారని, తనకేమీ తెలియదని జగన్‌ తన పిటీషన్‌లో పేర్కొన్నారు. తాను ప్రయాణిస్తున్న కారు, దానికి ఇరువైపులా నిల్చుని ఉన్న గార్డులతో కలిపి వాహనం బరువు 4వేల కేజీల వరకు ఉంటుందని, మృతుడు సింగయ్య మీద గాయాలను పరిశీలిస్తే వాహనం కింద పడి నలిగినట్లు లేదని, దీనిపైన పోలీసులు చెబుతున్న వాదనలు నమ్మేవిధంగా లేవని, ప్రజల్లోకి తాను వెళ్లకుండా, ప్రజలను తాను కలవకుండా రాజకీయ దురుద్దేశంతోనే కూటమి ప్రభుత్వం కావాలనే తనను ఈ కేసులో ఇరికించింది. మృతుడి భార్య లూర్థు మేరీ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం తనపై తొలుత బీఎస్‌ఎస్‌ 106(1)ప్రకారం గుంటూరు నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారని, తర్వాత ఈ కేసును 105, 49 సెక్షన్ల కిందకు మార్చారు. రాజకీయ ప్రతీకారంతోనే తనను సింగయ్య కేసులో ఇరికించారని జగన్‌ తన పిటీషన్‌లో పేర్కొన్నారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని తనపై కావాలని నమోదు చేసిన కేసును కొట్టివేయాలని తన పిటీషన్‌లో జగన్‌ కోర్టును కోరారు.
Tags:    

Similar News