'జగన్‌ అంటే నమ్మకం..చంద్రబాబు అంటే మోసం'

కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అయిన సందర్భంగా సీఎం చంద్రబాబు ఏడాదిపాలనపై వైసీపీ ఒక పుస్తకాన్ని తీసుకొచ్చింది.;

Update: 2025-06-12 12:50 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబు దుష్ట పాలనకు ముకుతాడు వేయాలని వైసీపీ స్టేట్‌ కోఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. ఇంకా నాలుగు ఏళ్లు సమయం ఉంది కాదా.. అని ఆలోచనలను పక్కన పెట్టి ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయటం లేదని సీఎం చంద్రబాబును, కూటమి ప్రభుత్వాన్ని నిలదీయాలని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయిన సందర్భంగా.. సీఎం చంద్రబాబు ఏడాది పాలçనపై పుస్తకాన్ని విడుదల చేసింది. ‘జగన్‌ అంటే నమ్మకం..చంద్రబాబు అంటే మోసం’ పేరుతో వైసీపీ పుస్తకాన్ని ఆ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజని, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, వరుదు కళ్యాణి, మజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌తో కలిసి విడుదల చేశారు.

ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు ఏడాది పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఏడాది కూటమి పాలనంతా విధ్వసంమే అని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని విమర్శించారు. భారత దేశపు రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్నే అమలు చేశారని, దీనికి సంబందించిన వాస్తవాలు.. ఆధారాలతో కలిపి ఈ పుస్తకాన్ని తెచ్చినట్లు తెలిపారు. మోసపు హామీలు, అబద్దాపు మాటలతో మభ్యపెట్టి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ఎలా వెన్నుపోటు పొడిచారో కూడా ఈ పుస్తకంలో వివరించినట్లు సజ్జల పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన బంగారు భవిష్యత్‌ వంటిదని, కూటమి, సీఎం చంద్రబాబు ఏడాది పాలనంతా చీకటి మయమే అని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు దుష్ట పాలన మొత్తం గురించి బుక్‌ వేయాలంటే ఐదువేల పేజీలు అవుతుందన్నారు. ఏడాది దుష్ట పాలన మీద తీసుకొచ్చిన జగన్‌ అంటే నమ్మకం.. చంద్రబాబు అంటే మోసం పుస్తకాన్ని ప్రతి ఒక్కరు చదవాలని, దుష్ట పాలన గురించి తెలుసుకోవాలని, తద్వార ముకుతాడు వేయాలని సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు.
Tags:    

Similar News