ఏపీ హైకోర్టును ఆశ్రయించిన జగన్
తనకు జెడ్ప్లస్ కేటగిరీ భద్రతను పునరుద్దరించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.;
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. తనకు జెడ్ప్లస్ కేటగిరీ సెక్యూరిటీని పునరుద్దరించే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలివ్వాలని కోరుతూ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. తనకు జెడ్ప్లస్ కేటగిరీ భద్రతను పునరుద్దరించాలనే అంశంపైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అనేక సార్లు వినతి పత్రాలు ఇచ్చాను. కానీ తన వినతిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. కేంద్ర సంస్థలైన సీఆర్పీఎఫ్ లేదా ఎన్ఎస్జీలతో కూడిన భద్రత కల్పించకపోవడం అనేది రాజ్యాంగ విరుద్దం. తనకు ప్రాణహాని ఉంది. దీనిని పరిగణనలోకి తీసుకొని నిర్థిష్ట ప్రొటోకాల్కు అనుగుణంగా తనకు జెడ్ప్లస్ కేటగిరీ పునరుద్దరించాలని కోర్టును కోరారు. వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బంది, జామర్లు, ఇల్లు, కార్యాలయం వద్ద సెక్యూరిటీ, వర్కింగ్ కండిషన్లోని బుల్లెట్ప్రూఫ్ వాహనం సమకూర్చే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వాలి.