భారీ ఉత్కంఠ..లడ్డూ వివాదంపై నేడు సుప్రీం కోర్టు విచారణ

లడ్డూ వివాదం విచారణపై భారీ ఉత్కంఠ నెలకొంది. సుప్రీం కోర్టు విచారణ చేపట్టనుంది.

Update: 2024-10-04 04:40 GMT

లడ్డూ వివాదంపై నేడు సుప్రీం కోర్టు విచారణ చేపట్టనుంది. గురువారం జరగాల్సిన విచారణను నేటికి వాయిదా వేసింది. వేరే కేసులో బిజీగా ఉన్న కారణంగా శుక్రవారం విచారణ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ రోజు ఉదయం పూటే దీనిపై సుప్రీం కోర్టు చేపట్టనుంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు, ఆంధ్రపదేశ్‌ ప్రభుత్వంపై సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో శుక్రవారం జరిగే విచారణలో సుప్రీం కోర్టు ఎలా స్పందిస్తుంది, ఎలాంటి తీర్పును వెలువరిస్తుందనే దానిపై ఆంధ్రప్రదేశ్‌తో పాటు యావత్‌ భారత దేశం ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్, టీటీడీ నేత పట్టాభిరామ్‌ గురువారం చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మరింత ఉత్కంఠ పెరిగింది. మత విద్వేషాలకు మరింత ఆజ్యం పోసినట్టైంది. అటు దసరా నవరాత్రులు, ఇటు తిరుమల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో వీరు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Tags:    

Similar News