ఎస్వీయులోకి చిరుత ఎలా వచ్చింది..!

బోనులో చిక్కిన చిరుతను ఏం చేశారు?;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-08-18 04:34 GMT

తిరుమల శేషాచలం అడవులకు దిగువ భాగంలో చిరుతల సంచారం పెరిగింది.

తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆవరణలో ఓ మగ చిరుత అటవీశాఖ అధికారులు అమర్చిన బోనులో ఆదివారం రాత్రి చిక్కింది.
"ఈ చిరుతను శేషాచలం అడవుల్లో సురక్షితంగా వదలడానికి తీసుకు వెళుతున్నాం" అని తిరుపతి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (Tirupati forest range officer FRO) చెప్పారు.

తిరుమలకు ముఖద్వారంగా ఉన్న అలిపిరి నుంచి శ్రీ వెంకటేశ్వర జంతుప్రదర్శనశాల వరకు చిరుతరు ఎందుకు సంచరిస్తున్నాయి? ప్రజలు కూడా తీసుకోవలసిన జాగ్రత్తలను అటవీశాఖ గుర్తుచేస్తోంది.
అలిపిరి నుంచి ఎస్వి జూ పార్కుకు వెళ్లే బైపాస్ రోడ్డు మొత్తం శేషాచలం అడవులకు దిగువ భాగంలోని ఉంది.
ఈ రోడ్డు వెంట పడవేస్తున్న వ్యర్థ పదార్థాలు ప్రధానంగా ఎస్వీ యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో ఆహార పదార్థాలు పడవేస్తున్నారు. కుక్కలు ఎక్కువగా సంచరిస్తున్నాయి. అలాగే వన్యప్రాణుల సంచారం కూడా అధికంగా ఉంది. అందువల్ల
"తిరుమలగిరిల నుంచి చిరుతలు దిగువ ప్రాంతానికి వస్తున్నాయి" అనేది తిరుపతి అటవీ శాఖ అధికారి సుదర్శన్ రెడ్డి విశ్లేషించారు.

అలిపిరి బైపాస్ రోడ్డులో అరబిందో కంటి ఆసుపత్రికి సమీపంలో మూడు వారాల కిందట బైక్ పై వెళుతున్న ఓ వ్యక్తిపై చిరుత పులి దాడి చేసింది. ఈ సంఘటనతో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు శేషాచలం కొండలకు దిగువన దట్టమైన అడవిలో ఒక బోను ఏర్పాటు చేశారు. అందులో ఓ జంతువును కూడా ట్రాప్ కెమెరాలు అమర్చారు. 15 రోజులుగా నిరంతరం నిఘా ఉంచినప్పటికీ చిరుతం బోనులో చిక్కలేదు.
ఈ పరిస్థితిని అధ్యయనం చేసిన తిరుపతి అటవీ శాఖ అధికారులు, చిరుత సంచారం పై తులసితంగా దృష్టి నిలిపారు.
" తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ పరిపాలనా భవనం వెనుక వైపు తో పాటు మరో మూడు చోట్ల కూడా బోర్లు అమర్చినట్లు"తిరుపతి అటవీ శాఖ అధికారి సుదర్శన రెడ్డి చెప్పారు.
"తిరుమల ఏడవ మైనమించి అటవీ ప్రాంతంలో అలిపి బైపాస్ రోడ్డుకు కేవలం మూడు పిలువ మెట్ల దూరం మాత్రమే ఉంది. ఆహారం కోసం దిగు ప్రాంతానికి చిరుతలు వస్తున్నాయి" అని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సుదర్శన్ వివరించారు.

Full View


చిరుత ఎలా దొరికిందంటే..
వన్యమృగాల వల్ల ప్రజలకు నష్టం జరగకూడదు. అలాగే కొన్ని ప్రాణులు కూడా సురక్షితంగా ఉండాలని దిశగానే అటవీ శాఖ చర్యలు తీసుకుంటోంది. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తో పాటు సమీప ప్రాంతాల్లోని అడవిలో నాలుగు చోట్ల చిరుత కోసం బోర్లు ఏర్పాటు చేశారు. అందులో ఎస్వీయూలో చిరుత దొరికిన వివరాలను ఎఫ్ఆర్ఓ సుదర్శనరెడ్డి ఫెడరల్ ఆంధ్ర ప్రదేశ్ తో పంచుకున్నారు.
"గత మూడు వారాలలో, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం (SVU) క్యాంపస్, వేదిక్ విశ్వవిద్యాలయం, అలిపిరి–జూ రోడ్డు సమీపంలో చిరుతపులి సంచారంపై వచ్చిన నివేదికల ఆధారంగా నాలుగు ట్రాప్ బోనులను వ్యూహాత్మకంగా ఏర్పాటు చేశాం. ఆదివారం రాత్రి 11:30 గంటల ప్రాంతంలో, ఒక మగ చిరుతపులి ఈ బోనులో చిక్కింది" అని ఎఫ్ఆర్ఓ సుదర్శన్ రెడ్డి చెప్పారు.
ఈ ప్రదేశాలను జనసంచారంతో పాటు అనేక విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ప్రజలు, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజా భద్రత, మానవ-వన్యప్రాణుల సంఘర్షణను తగ్గించడానికి చేసిన ఆపరేషన్ ఫలించింది అని ఆయన వివరించారు.
అటవీ శాఖ ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలు (SOPలు) ప్రకారం అధికారుల నుంచి అనుమతి తీసుకున్న తర్వాత ఈ చిరుతను బంధించాం అని ఎఫ్ ఆర్ ఓ వివరించారు.
చిరుతల సంరక్షణ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. బంధించిన ఈ చిరుతను జనాభాసాలకు దూరంగా ఉన్న దట్టమైన అడవిలో సురక్షితంగా వదిలివేయడానికి తీసుకు వెళుతున్నాం అని వివరించారు.
Tags:    

Similar News