కొంప ముంచిన సరదా ఈత
చెరువులోకి దిగిన ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడ్డారు.;
పోయిన నెలలో కోనసీమ జిల్లా మమ్ముడివరం మండలంలో సరదా ఈత కోసం గోదావరిలోకి దిగి ఎనిమిది మంది మృత్యువాత పడిన ఘటన నుంచి తేరుకోక ముందే ఆదివారం మరో దుర్ఘటన చోటుచేసుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో డుంబ్రిగూడ మండలంలో ఈ దారుణం చోటు చేసుకుంది. సరదా ఈత కోసం చెరువులోకి దిగిన ముగ్గరు చిన్నారులు ప్రాణాలు పోగొట్టుకున్నారు.
డుంబ్రిగూడ మండలం గుంటసీమ పంచాయతీ పరిధిలోని గంగవలస గ్రామానికి చెందిన కొర్ర సుశాంత్తో పాటు కోతంగి పంచాయతీ పరిధిలోని బిల్లాపుట్ గ్రామానికి చెందిన గుంట భానుతేజ, సాయికిరణ్లు సరదాగా ఈత కొట్టేందుకు గుంటసీమ జంగమయ్య ఆలయానికి ఎదురుగా ఉన్న చెరువులోకి దిగారు. లోతు ఎక్కువుగా ఉండటంతో ఈతకు దిగిన ముగ్గురు పిల్లలు ఊపిరి ఆడక మృతి చెందారు. ఈ దుర్ఘటనతో గుంటసీమ, గంగవలస, బిల్లాపూర్ చుట్టుపక్కల గ్రామాల్లో విషాదం నెలకొంది. మృతుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. స్థానికులను సైతం ఈ ఘటన కన్నీరుపెట్టించింది.