గుండె పోటుతో మరణించిన రాజేంద్రప్రసాద్‌ కుమార్తె

రాజేంద్రప్రసాద్‌కు ఇద్దరు పిల్లలు. ఒక కుమార్తె, ఒక కుమారుడు.

Update: 2024-10-05 10:32 GMT

ప్రముఖ నటుడు, నటకిరీటి రాజేంద్రప్రసాద్‌ కుమార్తె గాయత్రికి గుండె పోటు రావడంతో మృతి చెందారు. ఆమెకు ఇప్పుడు 38 ఏళ్లు. దీంతో రాజేంద్రప్రసాద్‌ ఇంట్లో విషాదం నెలకొంది. రాజేంద్రప్రసాద్‌ కుమార్తె గాయత్రి శుక్రవారం కార్డియాక్‌ అరెస్టుకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఒక్క సారిగా ఆందోళనలకు గురయ్యారు. ఆలస్యం చేయకుండా గాయత్రిని హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్‌కు హుటాహుటిన తరలించారు. చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. రాజేంద్రప్రసాద్‌కు ఒక కుమారుడు. ఒక కుమార్తె. పిల్లలంటే రాజేంద్రప్రసాద్‌కు చాలా ఇష్టం. తన పిల్లలను ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నారు. ప్రాణపదంగా పెంచుకున్న కుమార్తె హఠాత్తుగా కన్నుమూయడంతో రాజేంద్రప్రసాద్‌ న్నీరుమున్నీరవుతున్నారు. రాజేంద్రప్రసాద్‌ కుమార్తె గాయత్రి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు. ప్రముఖ సినీ నటుడు, ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్, నటులు జూనియర్‌ ఎన్టీఆర్, నాని సానుభూతిని తెలియజేశారు. రాజేంద్రప్రసాద్‌ కుమార్తె గాయత్రి మృతి తీవ్ర దిగ్బ్రాంతిని కలుగజేసిందని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్నుట్లు పవన్‌ కళ్యాణ్‌ చెప్పారు. తనకు అత్యంత అప్తులైన రాజేంద్రప్రసాద్‌ కుమార్తె గాయత్రి మృతి చెందడం విషాదకరమని జూనియర్‌ ఎన్టీఆర్, నాని అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, రాజేంద్రప్రసాద్, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సాను భూతిని తెలియజేశారు.

Tags:    

Similar News