'ముగ్గురు పిల్లలు ముద్దు’ చంద్రబాబు కొత్త నినాదం

మూడో బిడ్డను కనాలనుకంటే ఆర్థిక సాయం చేస్తామంటున్న సిఎం చంద్రబాబు నాయుడు;

Update: 2025-06-09 03:19 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముగ్గురు పిల్లలను కనాలనుకుంటున్న జంటలకు ప్రోత్సాహకాలను ప్రకటించాలని భావిస్తున్నది. అంతేకాదు, ఇంకా ఎక్కువ మంది కంటే మరిన్ని ఎక్కువ ప్రోత్సాహకాలు వస్తాయి.  పెద్దకుంబాటలకు పెద్ద ప్రోత్సాహకాలు ఉంటయాని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. అంతేకాదు, మూడో సంతానం కనాలనుకుంటున్న జంటలకు ఆర్థిక సాయం కూడా అందించాలని  ఆయన అనుకుంటున్నారు.

సంతానంతో ఇళ్లన్నీ పెద్ద కుటుంబాలైకలకలలాడాని ఆయన కలకంటున్నారు. తొందరలో ఇది ఒక విధానంగా విడుదల కానుంది.

జనాభాను పెంచే విధానాలను చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని ఎన్ డిఎ ప్రభుత్వం ఆమలుచేయడం మొదలుపెట్టింది.  మహిళల ప్రసూతి శెలవుల మీద ఇప్పటికే ఆంక్షలను తొలగించారు.  రాష్ట్రం జనాభా సమస్యను ఎదుర్కోబోతున్నందున  ఎక్కువ జననాలను ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్ను చర్యల్లో ఇదొకటి.

ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ఇద్దరు సంతానం విధానం అమలులో ఉంది. ప్రసూతి శెలవుకు, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఈ నియమం వర్తిస్తుంది. అంటే, మూడో సంతానానికి మహిళలకు ప్రసూతి శెలవు అర్హత లేదు. అదేవిధంగా ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీల్లేదు. 

ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ముగ్గురు అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కనేందుకు స్వేచ్ఛ నిస్తున్నారు. 

గత యాభైయేళ్లుగా దేశంలో కుటుంబ నియంత్రణ విధానం అమలు అవుతూ వస్తున్నది. అంతకుముందు కుటుంబాలన్నీ పెద్దవే. అయిదారు నుంచి పది  మంది దాకా పిల్లలని కనే కుటుంబాలు ఉండేవి. ఆ నేపథ్యంలో కుటుంబ నియంత్రణ విధానం వచ్చింది. క్రమంగా ప్రజలను కుటుంబ నియంత్రణ ఆరేషన్ చేయించుకునేందుకు అందమయిన నినాదలతో ప్రోత్సాహకాలు ప్రకటించారు. మొదటి వచ్చిన నినాదం ‘ చిన్నకుటుంబం చింతలు లేని కుటుంబ’.  దీనిని ఇంకా స్పష్టం గా చెబుతూ ‘ఇద్దరు లేక ముగ్గురు పిల్లలు’చాలు అన్నారు. తర్వాత ఈ కుటుంబం కూడా భారమని భావించి, ‘ మేమిద్దరం, మాకిద్దరు’ అని నినాదం తీసుకువచ్చారు.  ఆ తర్వాత  ఇంకా చిన్న కుటుంబాలయితే ఇపుడున్నఆర్థిక పరిస్థితులలో పిలల్లను పోషించడం కష్టమని భావించి, ‘ఒక్కరు లేక ఇద్దరు చాలు’ అన్నారు. ఇది జనంలోకి బాగా దూసుకుపోయింది. యువజంటలే కుటుంబం సైజు నిర్ణయించుకోవడం మొదలుపెట్టాయి. ఈ సారి నినాదం ప్రభుత్వం నుంచి కాకుండా సమాజం నుంచి వచ్చింది. అదే ‘ వన్ ఆర్ నిల్’ నినాదం. ఇది విశ్వమంతా వ్యాపించింది. చివరకు పిల్లలు వద్దనుకునే వారి సంఖ్య ఎక్కువై పోయిన జనాభా తగ్గిపోవడం మొదలయింది. చాలా దేశాలు వచ్చే యాభైయేళ్లలో యువకుల కొరత ఎదుర్కోబుతున్నదనే ఆందోళన మొదలయింది. జపాన్ వంటి దేశాలలో పర్యటించి వచ్చాక చంద్రబాబు నాయుడికి కూడా ఈ ఆందోళన ఎక్కువయింది. దాన్నుంచే ఆయన ఇపుడు జనాభా పెరుగదల గురించి ఆలోచిస్తున్నారు. 

అందులో భాగంగానే ‘కుటుంబాలకు ఇన్సెంటివ్ ఇవ్వాలనుకుంటున్నాను. పెద్ద కుటుంబాలకు భారీ ఇన్సెంటివ్ ఉంటాయి,’ అని ముఖ్యమంత్రి నాయుడు మీడియాకు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్ డిఎ పాలన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన  మీడియాకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చారు. గత ఏడాది జూన్ పన్నెండున ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

జనాభా నియంత్రణ మీద దక్షిణాది రాష్ట్రాలు అనుసరిస్తున్న వ్యూహాలను సమీక్షించుకోవలసిన సమయం ఆసన్నమయిందని ఆయన అన్నారు.

’ఆంధ్రప్రదేశ్ సంతానోత్పత్తి రేటు పెరగాల్సిన అవసరం ఉంది.ఇపుడు రేటుతో భవిష్యత్తు రాష్ట్రానికి చాలా సమస్యలు వస్తాయి.ఈ సమస్యరాకుండా ఉండేందుకే  పిల్లలు ఎక్కువ మంది ఉంటే పెద్ద కుటుంబాల గురించి నేను ఆలోచిస్తున్నాను,’ అని ఆయన అన్నారు.

ఇటీవలే ప్రసూతి శెలవుల మీద ఉన్న ఆంక్షలను ఆంధ్రప్రదేశ్ ఎత్తేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ,‘గతంలో రెండు ప్రసవాలకే ప్రసూతి శెలవులు ఉండేవి. ఇపుడు ఆనియమం ఎత్తేశాం,’ అని ఆయన అన్నారు.

అదేవిధంగా, ప్రతి సంస్థ, కార్యస్థానాలలో చైల్డ్ కేర్ సెంటర్ ని ఏర్పాటు చేయాల్సి ఉంటుందని కూడా ఆయన చెప్పారు. రాష్ట్రంలో  పాఠశాలకువెళ్లే ప్రతివిద్యార్థికి ఏడాదికి రు.15 వేలు ఇస్తున్నవిషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. ఈ డబ్బునేరుగా తల్లుల బ్యాంక్ అకౌంట్ లలో జమ చేస్తారు.





Tags:    

Similar News