పీవీని ప్రశంసించిన చంద్రబాబు,లోకేష్‌

104వ జయంతి సందర్భంగా తండ్రీ, కొడుకులు పీవీకి నివాళులు అర్పించారు.;

Update: 2025-06-28 05:13 GMT

తండ్రీ, కొడుకులు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లు భారత మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహరావుపై ప్రశంసల వర్షం కురిపించారు. పీవీ నరసింహారావు ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి అని, ప్రధానిగా ఉన్న సమయంలో పీవీ తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు భారత దేశ దశ దిశను మార్చేశాయని కొనియాడారు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న భారత దేశాన్ని తనదైన శైలిలో ముందుకు నడిపించారని కితాబులిచ్చారు. పీవీ నరసింహారావు 104వ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌లు సోషల్‌ మీడియా వేదికగా ఆయనకు నివాళులు అర్పించారు.

చంద్రబాబు ఏమన్నారంటే
భాతర మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 104వ జయంతి సందర్భంగా ఘననివాళి అర్పిస్తున్నాను. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉండగా ప్రదాని బాధ్యతలు స్వీకరించి, ఆర్థిక సంస్కరణల ద్వారా దేశగతిని మార్చిన పీవీ ఎప్పటికీ స్పూర్తిగానే నిలుస్తారు. ఆ మహనీయుడి çస్మృతికి మరొక్క మారు నివాళులు అర్పిస్తున్నాను. అంటూ ట్వీట్‌ చేశారు.

నారా లోకేష్‌ ఎమన్నారంటే..

దేశ మాజీ ప్రధాన మంత్రి, భారత రత్న పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి ఘన నివాళులు అర్పిస్తున్నాను. తొలి తెలుగు ప్రధానిగా, ఆర్థిక సంస్కరణల రూపకర్తగా ఆయన కీర్తి గడించారు. బహుముఖ ప్రజ్ఞాశాలి పీవీ నరసింహారావు. దేశానికి, రాష్ట్రానికి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకుందాం. అంటూ ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు.


Tags:    

Similar News