పీవీని ప్రశంసించిన చంద్రబాబు,లోకేష్
104వ జయంతి సందర్భంగా తండ్రీ, కొడుకులు పీవీకి నివాళులు అర్పించారు.;
తండ్రీ, కొడుకులు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు భారత మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహరావుపై ప్రశంసల వర్షం కురిపించారు. పీవీ నరసింహారావు ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి అని, ప్రధానిగా ఉన్న సమయంలో పీవీ తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు భారత దేశ దశ దిశను మార్చేశాయని కొనియాడారు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న భారత దేశాన్ని తనదైన శైలిలో ముందుకు నడిపించారని కితాబులిచ్చారు. పీవీ నరసింహారావు 104వ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లు సోషల్ మీడియా వేదికగా ఆయనకు నివాళులు అర్పించారు.
భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గారి 104వ జయంతి సందర్భంగా ఘననివాళి అర్పిస్తున్నాను. దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉండగా ప్రధాని బాధ్యతలు స్వీకరించి ఆర్థిక సంస్కరణల ద్వారా దేశగతిని మార్చిన పీవీ ఎప్పటికీ స్ఫూర్తిగానే నిలుస్తారు. ఆ మహనీయుడి స్మృతికి మరొక్క మారు నివాళి… pic.twitter.com/8yk7TXifZK
— N Chandrababu Naidu (@ncbn) June 28, 2025
నారా లోకేష్ ఎమన్నారంటే..
దేశ మాజీ ప్రధానమంత్రి, భారతరత్న పీవీ నరసింహారావు గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి ఘన నివాళులు అర్పిస్తున్నాను. తొలి తెలుగు ప్రధానిగా, ఆర్థిక సంస్కరణల రూపకర్తగా ఆయన కీర్తిగడించారు. బహుముఖ ప్రజ్ఞాశాలి పీవీ నరసింహారావు గారు. దేశానికి, రాష్ట్రానికి ఆయన చేసిన సేవలను ఈ… pic.twitter.com/R4S0FZ9VPS
— Lokesh Nara (@naralokesh) June 28, 2025