జగన్‌కు కోర్టు అనుమతి..

విదేశీ పర్యటనకు వెళ్లడానికి అనుమతి కోరిన సీఎం జగన్‌కు కోర్టులో ఊరట లభించింది.

Update: 2024-05-14 12:33 GMT

సీబీఐ కోర్టులో సీఎం జగన్‌కు ఊరట లభించింది. విదేశాలకు వెళ్లడానికి అనుమతివ్వాలన్న ఆయన అభ్యర్థనకు కోర్టు సమ్మతించింది. జగన్ అభ్యర్థనకు సీబీఐ తన వాదనలు గట్టిగా వినిపించినప్పటికీ లాభం లేకుండా పోయింది. జగన్‌ను విదేశాలకు వెళ్లడానికి అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. చెప్పి సమయానికి మళ్లీ తిరిగి రావాలని జగన్‌కు స్పష్టం చేసింది. అయితే మే 16 నుంచి జూన్ 1వ తేదీ వరకు విదేశాలకు వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ జగన్ పిటిషన్ దాఖలు చేశారు. లండన్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్‌లో పర్యటించడానికి వీలుగా అనుమతి ఇవ్వాలని ఆయన తన పిటిషన్‌లో కారురు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన సీబీఐ కోర్లు.. ఈ అంశంలో తమ అభిప్రాయం తెలపాలని సీబీఐని కోరింది. అయితే జగన్‌ యూరప్ పర్యటనకు అనుమతి ఇవ్వకూడదని సీబీఐ తనపు వాదనలు వినిపించింది. కానీ చివరకు ఈ పిటిషన్ విచారణలో జగన్‌కు అనుకూలంగా సీబీఐ కోర్టు తన తీర్పును వెలువరించింది.

Tags:    

Similar News