సజ్జల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు

ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ శిరీష ఫిర్యాదు మేరకు తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.;

Update: 2025-06-22 16:03 GMT

వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిపై పోలీస్ కేసు నమోదైంది. అమరావతి ప్రాంత మహిళలను కించ పరిచే విధంగా మాట్లాడారని, ఆయనపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తాడేపల్లి పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. 352, 353 (2), 196 (1) సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు. శిరీష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తాడేపల్లి ఎస్ఐ ఖాజావలి తెలిపారు.

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంపై దాడి కేసు, ముంబై నటి జత్వానీ కేసు, అటవీ భూములు ఆక్రమించారంటూ మరో కేసు గతంలో నమోదయ్యాయి. తాజాగా అమరావతి మహిళలను అవమానించేలా వ్యాఖ్యానించారని వచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

Tags:    

Similar News