బ్రౌన్ దొర తెలుగు భాషోద్ధారకుడు..జగన్, చంద్రబాబు విధ్వంసకులు
జీవో 85ను రద్దు చేయాలని, పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని తప్పనిసరి చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ తులసిరెడ్డి అన్నారు.
ఆంగ్లేయుడైన సర్ సిపి బ్రౌన్ దొర తెలుగు భాషోద్ధారకుడు, తెలుగు సూరీడు కాగా, తెలుగు వారైన జగన్, చంద్రబాబు తెలుగు భాష విధ్వంసకులు కావడం దురదృష్టకరం, శోచనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు ,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి అన్నారు. శుక్రవారం వేంపల్లి లో స్వర్గీయ సర్ సిపి బ్రౌన్ దొర 141 వ వర్ధంతిని కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తులసి రెడ్డి మాట్లాడుతూ.. ఒక ఆంగ్లేయుడైన సర్ సిపి బ్రౌన్ ఈస్టిండియా కంపెనీ తరఫున భారతదేశానికి వచ్చి, కడపలో ఇల్లు కొనుక్కొని ,తెలుగు భాష నేర్చుకొని ,తెలుగు నిఘంటువు రచించి ,తెలుగులో అనేక పుస్తకాలు రచించి, వేమన పద్యాలు సేకరించి తెలుగు భాషాభివృద్ధికి ఎనలేని కృషిచేసి ,పదవీ విరమణ అనంతరము ఇంగ్లాండ్ కు పోయి లండన్ విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రొఫెసర్ గా పని చేశాడన్నారు. అందుకే బ్రౌన్ దొర తెలుగు భాషోద్ధారకుడు, తెలుగు సూర్యుడు అయ్యాడని తులసి రెడ్డి కీర్తించారు.