జగన్ పై మరో కేసు
గుంటూరు మిర్చి యార్డ్ పర్యటనపై కేసు నమోదు;
By : V V S Krishna Kumar
Update: 2025-06-24 09:26 GMT
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై మరో కేసు గుంటూరు పోలీసులు నమోదు చేశారు.మిర్చి యార్డును అనుమతి లేకుండా సందర్శించారని జగన్ తో పాటు ఆ పర్యటనలో పాల్గొన్న ఇతర వైసీపీ నేతలకు గుంటూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు.ఫిబ్రవరి 19న జగన్ గుంటూరు మిర్చియార్డ్ ను సందర్శించి ,అక్కడి రైతులను పరామర్శించారు.
జగన్ మిర్చి యార్డ్ పర్యటన చేసిన సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో వుంది.ఎన్నికల కోడ్ వున్నా మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో నడిచే యార్డ్ లో వైసీపీ నేతలు అనుమతి లేకుండా హడావుడి చేశారని, జగన్ రాజకీయ ప్రసంగం చేశారని ఫిర్యాదు నమోదైంది. దీని ఆధారంగా జగన్ తో పాటు వైసీపీ నేతలు అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి , కావటి మనోహర్ నాయుడు,మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ,మరికొందరిపై నల్లపాడు పోలీస్ స్టేషన్నో కేసు నమోదు చేశారు.అందరికీ 41ఏ నోటీసులు ఇచ్చిన పోలీసులు ,పిలిచినప్పుడు నల్లపాడు పీఎస్ కు రావాలన్నారు.
పల్నాడు రెంటపాళ్ల పర్యటనలో వ్యక్తి మృతిపై నిన్ననే జగన్ పై గుంటూరు పోలీసులు కేసు నమోదు చేయగా , ఇరవై నాలుగు గంటలలోనే గుంటూరు లోనే మరో కేసు రికార్డ్ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.