1067 ఖాతాలకు ఆగిన అన్నదాత సుఖీభవ
44.75 లక్షల రైతులకు అన్నదాత సుఖీభవ నిధులు జమైనట్టు వ్యవసాయ శాఖ కమిషనర్ డిల్లీరావు తెలిపారు.;
శనివారం విడుదల చేసిన అన్నదాత సుఖీభవ నగదు బదిలీ 99.98 శాతం రైతుల ఖాతాలలోకి నగదు జమైనట్టు వ్యవసాయ శాఖ కమిషనర్ డిల్లీ రావు తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి– మోడల్ కోడ్ అమలులో ఉన్న ప్రాంతాలలోని సుమారు ఒక లక్ష మంది రైతులకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు తాత్కాలికంగా లక్ష ఖాతాలు, యన్ పి సి ఐ లో చురుకుగాలేని, మ్యాపింగ్ కానీ లక్ష మంది రైతుల ఖాతాలను మినహాయించి తక్కిన వారికి సుమారు 44.75 లక్షల రైతుల ఖాతాలకు డబ్బులు జమైనట్లు ఆయన పేర్కొన్నారు. ఆర్ టి జి ఎస్ వివరాల ప్రకారం కేవలం 1067 ఖాతాలకు మాత్రమే నగదు బదిలీ కాలేదన్నారు. ఆగస్టు 3 గ్రీవెన్స్ మాడ్యులు లో తిరస్కరణ లోనైన లబ్ధిదారులు నమోదుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. సీసీఆర్సీ కార్డులున్న భూమి లేని రైతులకు అక్టోబర్ నెలలో నిధుల విడుదల చేస్తామన్నారు.