పెళ్లిళ్లలో హాఫ్ సెంచరీ కొట్టిన మహిళ

Update: 2024-07-07 10:21 GMT

50 మందిని పెళ్లి చేసుకున్న ఓ నిత్య పెళ్లికూతురు ఉదాంతం తాజాగా వెలుగులోకి రావడంతో ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.





 


ఈ నిత్య పెళ్లికూతురు యువకులు, వ్యాపారవేత్తలతో పాటు, మామూలు వ్యక్తులతో పాటు ఏకంగా ముగ్గురు పోలీసుల సైతం బురిడీ కొట్టించింది ఇప్పుడు ఈ నిత్య పెళ్లికూతురు కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది



 


తిరుపూర్‌కు చెందిన 35 సంవత్సరాల యువకుడి పెళ్లికాకపోవడంతో. పెళ్లికూతురు కోసం అనేక వెబ్సైట్లో వెతుకుతూ వచ్చారు ఇదే సమయంలో ద తమిళ్ వే అనే వెబ్సైట్‌లో చూసి సంధ్య అనే మహిళను పరిచయం చేసుకుని వివాహం చేసుకున్నాడు. మొదట్లో అంతా బాగానే ఉన్నా కొద్దిరోజుల్లో సంధ్య ప్రవర్తనలో తేడా వచ్చింది ఇది గమనించిన పెళ్లి కొడుకు సంధ్య ఆధార్ కార్డును పరిశీలించగా ఆధార్ కార్డులో తన భర్త పేరు వేరే ఉండటంతో ఒక్కసారిగా షాక్ తిన్నాడు అనంతరం ఆమెను నిలదీయగా బాధితుడిని చంపేస్తానని బెదిరింపులకు పాల్పడింది దీంతో అతను పోలీసులను ఆశ్రయించాడు. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంధ్యను దర్యాప్తు చేయగా ఒక్కోక్కటికి పెద్ద లిస్ట్ బయట పడింది. ఆమె ఇప్పటి వరకు 50 పెళ్లిళ్లు చేసుకున్నట్లు తేలింది. తీగ లాగితే డొంక కదిలినట్లు ఆ నిత్య పెళ్లి కూతురు లిస్టులో ఒక డీఎస్పీ, ఇద్దరు పోలీసు అధికారులు, ఫైనాన్స్ అధికారి సహా 50 మంది ఉన్నారు. నగలు, డబ్బులే లక్ష్యంగా పెళ్లి చేసుకుంది. వారితో మొదటి రాత్రి పూర్తైన కొద్ది రోజులకు తన ప్లాన్ మొదలు పెట్టి నగలు, డబ్బులు దోచుకుని నెమ్మదిగా పరారయ్యేదని పోలీసుల విచారణలో సంద్య ఒప్పుకునటు పోలీస్లు తేలీపరు


Tags:    

Similar News