ఏపీ ఎడ్‌సెట్‌–2025లో 99శాతం ఉత్తీర్ణత

మంత్రి నారా లోకేష్‌ ఎడ్‌సెట్‌ ఫలితాలను విడుదల చేశారు.;

Update: 2025-06-20 10:26 GMT

ఆంధ్రప్రదేశ్‌ ఎడ్‌సెట్‌–2025 ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి నారా లోకేష్‌ ఎడ్‌సెట్‌ ఫలితాలను సోషల్‌ మీడియా వేదికగా శుక్రవారం విడుదల చేశారు. ఈ ఎడ్‌సెట్‌ ఫలితాలలో 99.42శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి లోకేష్‌ వెల్లడించారు. 17,795 మంది విద్యార్థులు రిజిస్టర్‌ చేసుకోగా వీరిలో 14,527 మంది అర్హత సాధించినట్లు లోకేష్‌ తెలిపారు. పరీక్షల ఫలితాలను cets.apsche.ap.gov.in                               

వెబ్‌సైట్‌ ద్వారా కానీ, వాట్సాప్‌ నంబర్‌ 9552300009 నంబర్‌ ద్వారా కానీ తెలుసుకోవచ్చన్నారు. విద్యార్థులు తమ ఎడ్‌సెట్‌ హాల్‌టికెట్‌ నంబర్‌తో పాటు పుట్టిన తేదీ వివరాలను ఎంటర్‌ చేసుకోవడం ద్వారా రిజల్ట్‌తో పాటు ర్యాంకు కార్డును కూడా పొందొచ్చన్నారు. ఆ మేరకు శుక్రవారం ఎక్స్‌ వేదిక ద్వారా మంత్రి లోకేష్‌ వెల్లడించారు. విద్యా సంవ్సరం 2025–26కు గాను బీఈడీ, బీఈడీ(స్పెషల్‌) కోర్సుల్లో ప్రవేశాల కోసం జూన్‌ 5న ఎడ్‌సెట్‌ పరీక్షను నిర్వహించారు. ఆచార్య నాగార్జున యూనివర్శటీ ఆధ్వర్యంలో ఈ పరీక్షను నిర్వహించారు.

Tags:    

Similar News