టిడ్కో ఇళ్లు పూర్తి చేయాలంటే 7వేల కోట్లు కావాలి

విశాఖ మెట్రో పనులు అక్టోబరులో ప్రారంభించనున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు.;

Update: 2025-05-21 14:29 GMT

ఆంధ్రప్రదేశ్‌లోని టిక్కో ఇళ్లను పూర్తి స్థాయిలో నిర్మాణాలు చేపట్టి లబ్ధిదారులకు అందజేయాలంటే రూ. 7వేల కోట్లు కావాలని మంత్రి నారాయణ అన్నారు. అంత నిధులు లేక పోతే టిడ్కో ఇళ్ల నిణ్మాలు పూర్తి చేయలేమని అన్నారు. విశాఖలో మంత్రి నారాయణ బుధవారం మాట్లాడుతూ టిడ్కో ఇళ్ల ప్రస్తావన చేశారు. గత ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్ల కోసం అప్పులు చేశారని, అయితే వాటి ద్వారా ఆ ఇళ్లను పూర్తి చేయలేదని, వాటి కోసం తెచ్చిన నిధులను పక్కదారి పట్టించారని మంత్రి నారాయణ వెల్లడించారు.

2014–19 మధ్య కాలంలో నాటి టీడీపీ ప్రభుత్వ హయాంలో టీడ్కో ఇళ్ల ప్రతిపాదనలను తెచ్చామని, 7లక్షల ఇళ్లను ప్రతిపాదించామని, కానీ వైసీపీ ప్రభుత్వం కనీసం రెండు లక్షలను కూడా పూర్తి చేయలేక పోయిందని విమర్శించారు. ఈ సారి మాత్రం టిడ్కో ఇళ్లను పూర్తి చేసి తీరుతామని, వాటి కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు వెనుకాడే ప్రసక్తి లేదని నారాయణ స్పష్టం చేశారు. ఈ దసరాకి టిడ్కో ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని వెల్లడించారు.

వచ్చే ఏడాది నాటికి భోగాపురం ఎయిర్‌ పోర్టును పూర్తి చేసి అందుడాటులోకి తెస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. ఈ భోగాపురం విమానాశ్రయాన్ని 22 రోడ్లతో అనుసంధానం చేసేవిధంగా ప్రతిపాదనలు చేశామని, వాటిల్లో ఇప్పుడు 15 రోడ్లు త్వరలో పూర్తి కానున్నట్లు తెలిపారు. తక్కిన రోడ్లన్నీ ఎన్‌హెచ్‌ఏఐను సమన్వయం చేసుకొని పూర్తి చేస్తామన్నారు.
2021లో అమృత్‌ పథకం కింద ప్రతి ఇంటికి తాగు నీరు అందించే విధంగా కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, కానీ వైసీపీ ప్రభుత్వం వాటికి మ్యాచింగ్‌ గ్రాంట్‌ ఇవ్వని కారణంగా అవి వెనక్కెళ్లి పోయాయి. అయితే వీటి మీద దృష్టి పెట్టిన సీఎం చంద్రబాబు కేంద్రాన్ని సంప్రదించి తిరిగి ఆ నిధులు వచ్చేలా చేశారని మంత్రి నారాయణ వెల్లడించారు. ఇలా వచ్చిన రూ. 834 కోట్ల నిధులతో అమృత్‌ పథకం కింద పనులు చేపట్టాలని నిర్థేశించినట్లు మంత్రి తెలిపారు. విశాఖ మెట్రో పనులు కూడా అక్టోబర్‌లో మొదలు పెట్టనున్నట్లు నారాయణ చెప్పారు. విశాఖ మెట్రో కోసం డబుల్‌ డక్కెర్‌ మెట్రో కోసం ఇప్పటికే డీపీఆర్‌లను అందజేసినట్లు చెప్పారు. విశాఖలో రింగ్‌ రోడ్డు ప్రతిపాదనలు కూడా ఉన్నాయని మంత్రి నారాయణ వెల్లడించారు.
Tags:    

Similar News