150 రోజుల్లో 150 కేసులు... అయినా మెగా డీఎస్సీ ఏమీ కాలే!

మెగా డిఎస్సీ నియామక పత్రాల పంపిణీ

Update: 2025-09-25 13:12 GMT

మెగా డీఎస్సీపై 150 రోజుల్లో 150 కేసులు వేసినా కానీ ఇచ్చిన హామీ ప్రకారం మెగా డీఎస్సీని పూర్తి చేశామని మంత్రి నారా లోకేష్‌ వెల్లడించారు. సీఎం చంద్రబాబు చెప్పిన విధంగా ఇకపై ప్రతిఏటా డిఎస్సీ నిర్వహిస్తాం, నవంబర్‌ లో టెట్‌ చేపడతాం, వచ్చేఏడాది మళ్లీ పారదర్శకంగా డిఎస్సీ నోటిఫికేషన్‌ ఇస్తామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్‌ శాఖల మంత్రి నారా లోకేష్‌ పేర్కొన్నారు. సచివాలయం సమీప ప్రాంగణంలో మెగా డిఎస్సీ విజేతలకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 150రోజుల్లో డిఎస్సీ నిర్వహించడం ఒక చరిత్ర, ఇది నెవర్‌ బిఫోర్, ఎవర్‌ ఆఫ్టర్‌. రాష్ట్ర ప్రజలందరి ఆశీస్సులతో మాకు మూడుతరాలు డిఎస్సీ ప్రకటించే అవకాశం వచ్చిందన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు తర్వాత నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. విద్యారంగాన్ని రాజకీయాలకు అతీతంగా ఉంచేందుకు వ్యవస్థలో పలు కీలకమైన సంస్కరణలు తెచ్చాం. ప్రాథమిక విద్యలో నాణ్యత పెంచేందుకు 9600 స్కూళ్లలో వన్‌ క్లాస్‌ వన్‌ టీచర్‌ విధానాన్ని తెచ్చాం. విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించేందుకు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చాగంటి కోటేశ్వరరావుని క్యాబినెట్‌ ర్యాంకుతో సలహాదారుగా నియమించాం. కారు, ఫోన్‌ తోపాటు కనీసం బాటిల్‌ నీరు కూడా ఆయన తీసుకోలేదు. ఆయన నిబద్ధతను అభినందిస్తున్నా.

నైతిక విలువలపై తాను రాసిన నాలుగు పుస్తకాలను విద్యార్థులకు అందించాలని ఆయన కోరారు. మహిళలను గౌరవించడం నర్సరీ నుంచే నేర్పించాలి. మార్పు మన ఇంటినుంచే రావాలి. మా ఇంట్లో మా తల్లి నుంచే గౌరవిస్తున్నాం. 1,2 తరగతుల పుస్తకాల్లో ఇంటిపనుల ఫోటోలను చెరో సగంగా ఉండేలా మార్పులు చేశాం. పాఠశాల విద్యలో అనేక సంస్కరణలు తీసుకువచ్చాం. విద్యార్థులకు పుస్తకాల బరువు తగ్గించాం.. శనివారం నో బ్యాగ్‌ డే అమలు చేస్తున్నాం. నైతిక విలువలు, లింగ సమానత్వం, రాజ్యాంగం గురించి పాఠాలు రూపొందించామని మంత్రి లోకేష్‌ పేర్కొన్నారు. ఇప్పటివరకూ 14 సార్లు డీఎస్సీలు నిర్వహించ 2 లక్షల టీచరు పోస్టులు భర్తీ చేశాం. సెప్టెంబర్‌ 5న టీచర్స్‌ డేకి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు నిర్వహించిన డీఎస్సీలో ఎంపికైన వారు చేతులు ఎత్తండని కోరితే...హాలులో 99 శాతం మంది చేతులు ఎత్తారు. ఇదీ తెలుగుదేశం పార్టీ ఘనత....ఇదీ చంద్రబాబు డీఎస్సీల చరిత్రని లోకేష్‌ అన్నారు.

అడ్డుకోవాలనే కుట్రతో కేసులు 
డీఎస్సీ ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదనే కుట్రతో కొందరు 150కిపైగా కేసులు వేయించారు. అధికారులు, న్యాయ సలహాలు తీసుకుంటూ ఎటువంటి లీగల్‌ సమస్యలు రాకుండా చూసుకున్నారు. 150 కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటూనే 150 రోజుల్లో డీఎస్సీ విజయవంతంగా నిర్వహింమని దీని కోసం కృషి చేసిన అధికారులు కోన శశిధర్, విజయరామరాజు, బి.శ్రీనివాసరావు, ఆకుల వెంకటరమణలకు కతజ్ఞతలు తెలియజేస్తున్నాను. స్పోర్ట్స్‌ కోటా 3 శాతం ఈ డీఎస్సీలో అమలైంది. మహిళలు, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులు, స్పోర్ట్స్‌ కోటా సహా అన్ని కేటగిరీల్లో వెర్టికల్, హారిజంటల్‌ రిజర్వేషన్లు పకడ్బందీగా పాటించాం. విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాల్లో పురుషులకు సమానంగా మహిళలకు అవకాశాలు దక్కాలని తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి పనిచేస్తోంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి అత్యధికంగా డీఎస్సీలో 49.9% పోస్టులను మహిళలకు దక్కించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.
నాకు లైఫ్‌ టైమ్‌ గురువు నాన్నే
దేశానికి అధినేత అయినా గురువు దగ్గర చదువుకున్న విద్యార్థే. వరల్డ్‌ రిచ్చెస్ట్‌ పర్సన్‌ కూడా ఒక గురువుకు స్టూడెంటే. ఇంజనీర్, డాక్టర్, యాక్టర్, లీడర్, లాయర్‌... ఎవ్వరైనా ఓ గురువు వద్ద శిష్యుడే. సర్వేపల్లి రాధాకష్ణన్‌ తనకు కృష్ణుడితో సమానమైన గురువు అని జాతిపిత మహాత్మా గాంధీ చెప్పారు. తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి ఫూలే బాలికా విద్య కోసం ఎంతగానో కృషి చేసారు. నాకు లైఫ్‌ టైం గురువు మా నాన్న..చంద్రబాబు. మిమ్మల్ని చూస్తుంటే నా టీచర్లు గుర్తొచ్చారు. వాళ్లు చెప్పిన పాఠాలు, కొట్టిన దెబ్బలు ఇంకా నాకు గుర్తున్నాయి. స్కూల్‌ లో మాది గోల బ్యాచ్‌ ... మేము ఫ్రెండ్స్‌ ఆఫ్‌ ఫస్ట్‌ బెంచర్స్‌. అంటే మాది లాస్ట్‌ బెంచ్‌. కానీ లాస్ట్‌ బెంచ్‌ నుండి స్టాంఫోర్డ్‌ కి నా ప్రయాణం ఎలా జరిగిందో మీకు చెబుతాను. స్కూల్‌ లో మంజులా మ్యాడం కొట్టిన దెబ్బలు, రమాదేవి మ్యాడం నేర్పిన డిసిప్లిన్‌ నాకు గుర్తున్నాయి. ఇంటర్‌ లో నారాయణ మాస్టారు బ్రిడ్జ్‌ కోర్సు. కార్నెగీ మెల్లన్‌ యూనివర్సిటీ లో ప్రొఫెసర్‌ రాజిరెడ్డి డైరెక్షన్‌ నేను ఎప్పటికీ మర్చిపోలేను. ప్రపంచంలో ఏ రంగంలో ఉన్నవారైనా, ఎంత గొప్పవారైనా తమ టీచర్లను గౌరవిస్తూ ఉంటారని మంత్రి లోకేష్‌ చెప్పారు
Tags:    

Similar News