పెరిగిన కోవిడ్ కేసుల సంఖ్య..
యాక్టివ్ కేసులు 2,710. మృతుల సంఖ్య 7;
దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. శుక్రవారానికి యాక్టివ్ కేసుల సంఖ్య 2,710గా నమోదైంది. కాగా ఇప్పటివరకు ఏడుగురు చనిపోయారు. దేశంలో మే 26న యాక్టివ్ కేసుల సంఖ్య 1,010. అయితే కేసుల సంఖ్య ప్రస్తుతం 69 శాతానికి పెరిగింది. COVID-19 డాష్బోర్డ్ డేటా ప్రకారం.. కేరళలో 1,147 యాక్టివ్ కేసులు, మహారాష్ట్రలో 424, ఢిల్లీలో 294, గుజరాత్లో 223, కర్ణాటక, తమిళనాడు కలిసి 148 కేసులు నమోదయ్యాయి. బీహార్ నుంచి ఇంకా సమాచారం అందాల్సి ఉంది.
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఏడు COVID మరణాలు సంభవించాయి. మృతులు ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడుకు చెందిన వారు. గుజరాత్కు చెందిన ఒక వ్యక్తి కూడా చనిపోయారు. అయిన మరణానికి గల కారణం తెలియాల్సి ఉంది.
భయం అక్కర్లేదు..
హాంకాంగ్, సింగపూర్, థాయిలాండ్లో కూడా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అదే సమయంలో భారత్లోనూ చాపకింద నీరులా విస్తరిస్తోంది. అయితే ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, కోవిడ్ ప్రొటోకాల్స్ పాటించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది.
కోవిడ్ లక్షణాలివే..
కేరళ రాష్ట్రం కొచ్చిలోని రాజగిరి హాస్పిటల్లో హెపాటాలజిస్ట్ డాక్టర్ సిరియాక్ అబ్బి ఫిలిప్స్ కోవిడ్ లక్షణాల గురించి చెబుతూ..జ్వరం, అలసట, నీరసం, గొంతు నొప్పి ప్రాథమిక లక్షణాలని పేర్కొన్నారు. ఆ తర్వాత తీవ్రత ఎక్కువైనపుడు గొంతు బొంగురుపోవడం, శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయన్నారు.
అప్రమత్తమయిన రాష్ట్ర ప్రభుత్వాలు..
కోవిడ్ కేసుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఇటు కర్ణాటకలో కోవిడ్ పరీక్షల సంఖ్యను పెంచారు. కేసుల సంఖ్య తక్కువగా ఉన్నా.. ప్రత్యేకించి VRDL (వైరల్ రీసెర్చ్ అండ్ డయాగ్నస్టిక్ లాబొరేటరీ) కేంద్రాలలో మాత్రమే పరీక్షలు చేయాలని ఆదేశించింది. నిమ్హాన్స్, బెంగళూరు మెడికల్ కాలేజీ, బెంగళూరులోని ఎన్ఐవి యూనిట్ సహా 10 కేంద్రాలను పరీక్షలకు సిద్ధం చేశామని రాష్ట్ర ఆరోగ్య మంత్రి దినేష్ గుండూ రావు తెలిపారు.