కలసి ఉంటేనే కలదు సుఖం...
లేకుంటే జాయిస్ విన్సెంట్ పరిస్థితి ఏదో ఒక రూపంలో రాచ్చు. ఇంతకీ ఎవరీ జాయిస్ విన్సెంట్?;
మానవ సంబంధాలు — ఇవి మన జీవితంలో వెలకట్టలేని నిధులు. కుటుంబం, స్నేహితులు, పొరుగువాళ్లు అనే బంధాలే మనిషిని ఒంటరితనపు అగాధం నుంచి బయటపడేలా చేస్తాయి.కానీ ఆధునిక జీవన శైలిలో, సంబంధాలు బలహీనపడుతున్న సమయంలో మనుషుల మధ్య దూరాలు పెరుగుతున్నాయి.
మానవ సంబంధాలు లేకపోతే మనిషి ఎంత ఒంటరితనానికి గురవుతాడో తెలుపడానికి జాయిస్ విన్సెంట్ (Joyce Carol Vincent:19 October 1965 – December 2003) కథ ఉదాహరణగా నిలుస్తుంది .
జాయిస్ విన్సెంట్ ఎవరు?
జాయిస్ కారోల్ విన్సెంట్ 1965లో ఇంగ్లాండ్లో జన్మించింది. మంచి విద్యావంతురాలు, స్వతంత్ర జీవనశైలి గల యువతి. ఆమె ఓ సంగీత ప్రియురాలు కూడా. కొంతకాలం టీవీ, సంగీత పరిశ్రమల్లో పనిచేసిన ఆమెకు అనేక మంది సెలబ్రిటీలతో పరిచయాలుండేవి. జీవితం సాఫీగా సాగిపోతున్న సమయంలో ఓ కుదుపు వచ్చింది. జాయిస్ మనోబలాన్ని కోల్పోయింది, జీవితం పట్ల ఆసక్తి తగ్గింది. తరువాత కాలంలోకుటుంబ సభ్యులతో కూడా క్రమక్రమంగా సంబంధాలు తగ్గించుకొంది .ఆ సమయాన ఆవిడను ఓదార్చేవారు , దైర్యం చెప్పేవారు, నీకు మేము వున్నాము అని భరోసా ఇచ్చేవారు ఉండివుంటే డిప్రెషన్ కి లోను అయ్యేదికాదేమో ? ఇవి ఏవి లేకపోవడం తో విన్సన్ట్ చేస్తున్న ఉద్యోగమును వదలి ఒంటరిగా జీవించటం అనే నరకాన్ని ఎంచుకోని ఉండేది కాదేమో??
ఆమె ఎలా మరణించింది?
జాయిస్ 38 ఏళ్ల వయసులో, 2003 డిసెంబర్లో తన అపార్టుమెంట్లో గుండెపోటుతో మరణించింది. కానీ ఆమె మృతదేహం మూడు సంవత్సరాల పాటు ఎవరికీ కనిపించలేదు. అప్పటివరకు ఇంటి అద్దెను ప్రభుత్వ హౌసింగ్ బోర్డు చెల్లిస్తుండటంతో ఎవరికీ అనుమానం రాలేదు. 2006 లో అద్దె చెల్లించకపోవడంతో భద్రతా అధికారుల ఇంటి ఇంటిని ఓపెన్ చేసి చూశారు. అప్పటికే జాయిస్ మరణించి మూడు సంవత్సారాలు అయింది. మృతదేహం పూర్తిగా గుర్తుపట్టలేని స్థితిలో కుర్చీలో పడిఉంది. ఇంట్లో టీవీ పనిచేస్తూనే ఉంది. హీటర్ పనిచేస్తూనే వుంది.క్రిస్మస్ గిఫ్టులు ఓపెన్ చేయకుండా అలాగే పడివున్నాయి.
కుటుంబానికీ తెలియనంతగా...
జాయిస్ తల్లి ఆమె పదకొండేళ్లపుడు మరణించింది. ఆమె తండ్రి, తన కూతురు చనిపోయిందన్న సంగతి తెలియక మరుసటి ఏడాది 2004 లో మృతి చెందాడు. జాయిస్ సోదరీమణులు ప్రైవేట్ డిటెక్టివ్ను నియమించి జాయిస్ పాత చిరునామా కనుగొన్నారు. ఆ చిరునామాకు అనేక లేఖలు రాసినా — జవాబేమీ రాలేదు.
ఒక మహిళ చనిపోయి, ఆమె బతికిన ఇంట్లోనే మూడు సంవత్సరాలు ఎవరికీ తెలియకపోవడం — ఇది కేవలం ఒకరి సమస్య కాదు. ఇది మన సమాజపు బాధ్యతలపై, మానవ సంబంధాల విలువలపై అద్దం పట్టే ఘోర వాస్తవం.
ఒంటరితనం – వ్యక్తిగతమే కాదు, సామాజిక సమస్య కూడా
ఈ సంఘటన ఏమి సూచిస్తుంది?
"పక్కవారికి ఏం జరుగుతున్నదో గమనించలేనంతగా మనం మనుషుల మధ్య బంధాలను కోల్పోయామని ఇది సూచిస్తుంది " ఇది యావత్ మానవ సమాజానికి ఓ హెచ్చరిక. నిర్లక్ష్యం కాదు, బాధ్యతల మరిచిపోతున్నాం
ప్రపంచం సోషల్ మీడియాలో 'కనెక్ట్' అయి కనిపిస్తున్నా — మనసుల మధ్య ఖాళీలు పెరుగుతున్నాయి. నిజమైన పరిచయాలు, మాట్లాడే మాటలు, పలకరించే మొగ్గు — ఇవన్నీ తగ్గిపోతున్నాయి. పక్కింటి వారు మూడు రోజులుగా బయటకి రాకపోతే కనీసం "ఏం జరిగింది?" అని అడగడం కూడా చేయడం లేదంటే మానవ విలువల పతనానికి సంకేతం కాక మరేమిటి ? ఇది మానవ సమాజం సిగ్గుతో తలవంచాల్సిన విషయం.
ఈ సంఘటన మనకు చెబుతున్నది
ఈ కథనం మన సంస్కృతి, మన విలువలు, మన పరిచయాలు అన్నింటినీ ప్రశ్నించాల్సిన సమయాన్ని చూపిస్తుంది. ఒక వ్యక్తి మరణించి మూడు సంవత్సరాలు ఎవరూ గమనించకపోవడం — ఇది మానవ సంబంధాల లోపాన్ని చూపే శోకాంతిక సంఘటన.
మనం నేర్చుకోవాల్సిన పాఠం:
మనకు బంధాలు, స్నేహితులు, కుటుంబ సభ్యులు ఎందుకు అవసరమో ఈ సంఘటన ద్వారా అర్థం అవుతుంది. మన చుట్టూ ఉన్నవాళ్లను గుర్తించండి, వారితో మాట్లాడండి, అవసరమైతే వెళ్లి కలవండి. వృద్ధులు, ఒంటరిగా జీవించే వ్యక్తులు ఎవరైనా ఉంటే వారిని కనీసం వారానికి ఒకసారి పలకరించండి. సాంకేతిక ప్రపంచంలో ‘సోషల్ మీడియా’ ఉందని మోహపడి నిజమైన ‘సోషల్ కాంటాక్ట్స్’ని కోల్పోకండి.
పొరుగువారితో సంబంధాలు మెరుగుపరచాలి. పక్కింటి వారు మూడు రోజులుగా బయటకు రాకపోతే ఎందుకో తెలుసుకోవాలనే బాధ్యత మనదే. మనుషుల్ని మనం గుర్తించకపోతే, వారు నిశ్శబ్దంగా ఎక్కడో కనుమరుగవుతారు. “ఒకరు బతికున్నారా లేదా అన్నదే తెలియని స్థితి — అది మన సమాజపు అపజయం మరియు అపమానకరం.
మానవ సంబంధాల మాధుర్యాన్ని నిలుపుకుందాం
జాయిస్ విన్సెంట్ మరణం ఒక సంఘటన కాదు. అది మానవతా విలువలపై ఆలోచించాల్సిన ఆత్మపరిశీలన. ఆమె మరణించిన విషయం తెలియక, ఆమె తండ్రి మరణించడం, ఆమె సోదరీమణులు ప్రైవేట్ డిటెక్టివ్ ద్వారా ఆచూకీ వెతకడం, చివరికి లేఖలు రాసిన తీరూ — ఇవన్నీ ఒంటరితనం ఎంత ఘోరమైనదో చూపిస్తాయి.ఒకరు మరణించి మూడు సంవత్సరాలు పట్టేంతగా మనం మన చుట్టూ వాళ్లను గమనించకపోతే, మనిషిగా మన పాత్ర ఏమిటి?
మనుషుల మధ్య మానవ సంబంధాలు ప్రేమ, ఆప్యాయత, బాధ్యతలకు ప్రతీక. వాటిని పెంపొందించుకోవడం మనందరి బాధ్యత. ఒక్క మాటలో చెప్పాలంటే – "ఒక మనిషి బతికున్నాడా, లేదా అన్నదీ తెలియని స్థితి, మన సమాజం పరాజయానికి సంకేతం."
ఈ ఘటన మనం మరవకూడదు. ప్రతిసారీ మనం ఒకరిద్దరితో చర్చించేటప్పుడు, పలకరించినప్పుడు, ఎవరో ఒకరి ముఖంలో చిరునవ్వు తీసుకురాగలిగితే — అదే నిజమైన మానవతా విలువ. మన మాట, మన చూపు, మన పరిచయం — ఇవన్నీ ఎవరో ఒకరి జీవితంలో వెలుగు వెలిగించే దీపాలవుతాయి, అవి ఎవరి జీవితాన్ని అయినా మార్చగలదు పరోక్షంగా ఓ ప్రాణాన్ని రక్షించవచ్చు