సంకీర్ణంలోనూ కొనసాగుతున్న ‘మోదీ’ దూకుడు?

నేటితో మోదీ 3.0 పాలనకు ఏడాది పూర్తి;

By :  580
Update: 2025-06-08 10:48 GMT
చీనాజ్ రైల్వే బ్రిడ్జి ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ

మోదీ మూడోసారి పాలనా పగ్గాలు చేపట్టి నేటితో ఏడాది పూర్తయింది. అయితే గత రెండు పర్యాయాలు సొంతంగా మెజారిటీ సాధించిన బీజేపీ, ఈసారి మిత్రపక్షాల సాయంతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

దీనితో ఈసారి పాలనలో మోదీ అత్యంత బలహీనంగా ఉంటారని అంతా భావించారు. కానీ నిజానికి 2014-2024 వరకూ ఉన్న పాలనకంటే ఎక్కువ అవకాశాలు, బలమైన నిర్ణయాలు ఇప్పుడే మనకు కనిపిస్తున్నాయి.

గత జూన్ లో రాజకీయ విశ్లేషకులు మోదీ లక్ష్యంగా అనేక విమర్శలు చేశారు. అయితే ఇప్పుడవన్నీ కేవలం ఎండమావులుగానే మిగిలిపోయాయి.

రికార్డు స్థాయిలో మూడోసారి ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన మోదీ నెహ్రూ రికార్డును సమం చేశారు. అయితే ఈసారి ఆయన పాలనకు కాసింత సీట్లు తగ్గాయి. ముఖ్యంగా 2019 లో ఆయన సంపూర్ణ మెజారిటీని మాత్రమే కాకుండా లోక్ సభలో ఏకంగా 303 స్థానాలు సాధించారు.
సిందూర్ ఆటుపోట్లను తిప్పికొడుతున్నారా?
పహల్గామ్ ఉగ్రవాద దాడి తరువాత మోదీ ప్రతీకార చర్య తీసుకున్నారు. 2016, 2019 లో ఆయన చెప్పినట్లుగానే ఉగ్రవాదులే లక్ష్యంగా దాడులు చేయించారు. ఇప్పుడు కూడా అదే పని చెప్పి చేశారు.
ఆపరేషన్ సిందూర్ తో పాక్ లోని ఉగ్రవాద శిబిరాలు, తరువాత ఆ దేశ సైన్యానికి తగిను గుణపాఠం చెప్పారు. ప్రస్తుతానికి ఎన్నికలు దగ్గర్లో లేనప్పటికీ జాతీయవాద ప్రతిస్పందన నేపథ్యంలో, ఎన్నికలలో ప్రజలు స్పందించిన దానిని బట్టి మరోసారి మోదీకి పరిస్థితి అనుకూలంగా మారినట్లు కనిపిస్తోంది.
సీ ఓటర్ తాజాగా నిర్వహించిన సర్వేలో పహల్గామ్ ఉగ్రవాద దాడిపై మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం స్పందించిన తీరు, సైనిక సంఘర్షణ తో సహ తరువాత ఉత్పన్నమయిన పరిణమాలపై 63.3 శాతం మంది ప్రజలు సంతృప్తి చెందారు.
అయితే ఈ సంఖ్య ఇంతకుముందు చేసిన సర్వేతో కాస్త తగ్గింది. ఆపరేషన్ కొనసాగుతున్నప్పుడు, సీజ్ ఫైర్ ప్రకటించినప్పుడూ 68.1 శాతం మంది పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు.
కాల్పుల విరమణ ప్రకటించినప్పుడూ ప్రజలు దానిని ఆమోదించలేదు. ఎందుకంటే భారత దళాలు మరింత ముందుకు వెళ్లి పాక్ దళాలకు భారీ స్థాయిలో నష్టం చేకూర్చాలని భారతీయులు భావించారు. 1971 నాటి విజయాలను తిరిగి రిపీట్ చేయడం లో మోదీ విఫలమైనట్లు భావించారు.
మోదీకి పూర్తిగా మద్దతు ఇచ్చిన చాలామంది ప్రజలు తమ మద్దతును ఉపసంహరించినప్పటికీ బీజేపీకి మాత్రం సైద్దాంతిక విరోధులుగా మారలేదు. దీనికి విరుద్దంగా హిందూత్వ, జింగోయిస్టిక్ జాతీయవాద మిశ్రమ నుంచి రాజకీయ మిశ్రమానికి మార్పు చెందారు.
ముఖ్యంగా కాంగ్రెస్ వంటి శక్తులు అటువంటి వర్గాలను బీజేపీ నుంచి దూరం చేయడానికి ప్రయత్నించింది. ఇందులో భాగంగా ఒక తప్పుడూ ఏఐ వీడియో సృష్టించింది.
ఆ వీడియోలో ‘‘ హే నరేంద్ర మోదీ నువ్వు ఏం చేశావు, నీకు అంతా మద్దతు ప్రకటించినప్పుడూ పూర్తి స్థాయిలో పోరాడి ఉండాలి. దళాలూ పూర్తి శక్తితో తలపడి ఉంటే విజయం దగ్గర్లోనే ఉండేది’’ అని అందులో అన్నట్లు చూపించారు.
కాల్పుల విరమణ పై రాహుల్ గాంధీ, మోదీపై విమర్శలు గుప్పించారు. నరేంద్ర మోదీ అమెరికా లొంగిపోయారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రకారం.. పాక్ పై సైనిక చర్యకు దేశవ్యాప్తంగా గణనీయంగా మద్దతు ఉందని వాదించింది.
వ్యక్తిత్వం ఎలా ఉంది..
పాకిస్తాన్ పై ఆపరేషన్ సిందూర్ నిర్వహించడం వలన మోదీకి ప్రజల మద్దతు లభించిందనే విషయంలో ఇదే చివరి సారి కాదు. బీహార్ లో తదుపరి దశ ఎన్నికలు జరిగే సమయం వరకూ ఇంకా అనేక పరిణామాలు జరిగి ఉండవచ్చు. బహుశా భారత్ - పాకిస్తాన్ యుద్ధ రంగంలో కూడా జరిగి ఉండవచ్చు. ఇది ప్రజల మనోభావాలను పాజిటివ్ గా లేదా నెగటివ్ గా కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది.
మోదీ 3.0 పాలన అనేది విమర్శకుల అంచనాలకు మించిసాగింది. గత పాలనకు భిన్నంగా మోదీకి అనుకూలంగా మాత్రం ఉంది.
గత సంవత్సరం మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించగానే మునుపటి పాలనా కాలంలో ఉన్నట్లుగా బలంగా ఉండబోరని విశ్లేషకులు భావించారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి 240 ఎంపీ స్థానాలు మాత్రమే వచ్చాయి. 2014 తరువాత తొలిసారిగా ఆయనకు సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపాల్సిన అవసరం ఏర్పడింది.
ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి టీడీపీ, జేడీయూ, లోక్ జనశక్తి పార్టీ వంటి పార్టీల మీద ఆధారపడాల్సి వచ్చింది. వీటికి లోక్ సభలో 34 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఇవి సాంకేతికంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో ఉన్నప్పటిక మునపటి రెండు టర్మ్ లలో తగిన ప్రాధాన్యం లభించలేదు.
కీలకమైన విధాన నిర్ణయాలలో వీటికి కనీసం మాట మాత్రమైన చెప్పలేదు. కీలకమైన మంత్రిత్వశాఖలు కూడా ఇవ్వలేదు. ప్రస్తుతం ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండటం వలన ఈ విషయంలో పార్టీలు తమ గొంతెమ్మ కోర్కేలు తీర్చుకునే విషయంలో చాలా గట్టి పట్టుదలతో ఉంటాయని భావిస్తున్నారు.
అయితే ఈ పార్టీ అంత దృఢంగా వ్యవహరించట్లేదని తేలింది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అందుకే మోదీ తన వ్యక్తిత్వాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేకుండా అలాగే దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.
గత సంవత్సరం లోక్ సభ ఎన్నికల ఫలితాల తరువాత ఎన్డీఏ సమన్వయ కమిటీని ఏర్పాటు చేయవల్సిన అవసరం ఉంటుందని, దానికి కన్వీనర్ గా బీజేపీయేతర నాయకుడిని నియమించాల్సి ఉంటుందని అంతా భావించారు.
1998- 2004 వరకూ అటల్ బిహారీ వాజ్ పేయ్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి మార్గదర్శక సూత్రాలు, జాతీయ ఎజెండా వంటి వాటిని తిరిగి తీసుకురావడానికి కొంత చర్చ జరిగింది. అయితే ఇది కూడా ఆలోచనలకే పరిమితం అయింది. అధికారిక కేంద్రీకరణ కేవలం మోదీ చేతుల్లోనే మిగిలిపోయింది.
సంఘ్ లో పలుకుబడి..
పార్లమెంటరీ ఎన్నికలలో బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించలేకపోవడానికి కారణం సంఘ్ మద్దతు లేకపోవడమే. అయితే గత ఏడాది కాలంగా ఆర్ఎస్ఎస్ పెద్దలతో మోదీ తన సాన్నిహిత్యాన్ని తిరిగి పునరుద్దరించుకున్నారు.
ఈ సంవత్సరం మార్చి చివరలో దాని ప్రధాన కార్యాలయం నాగ్ పూర్ లో పర్యటించారు. 2014 నుంచి జరుగుతున్న తన వ్యక్తిత్వ ఆరాధన కూడా ఇప్పుడు కాస్త తగ్గుముఖం పట్టింది.
ఆర్ఎస్ఎస్ కూడా తనవంతుగా హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ ఎన్నికల్లో తిరిగి బీజేపీ తరుఫున విజయవంతంగా ప్రచారం చేసింది. అయితే జార్ఖండ్ లో మాత్రం విఫలమైంది. అక్కడ కూడా ఆ సంస్థ పార్టీ అభ్యర్థుల కోసం పూర్తి స్థాయిలో బరిలోకి దిగింది.
పార్టీ నాయకత్వం..
పహల్గామ్ దాడికి ముందుకు బీజేపీ అధ్యక్షుడి విషయంలో విస్తృతమైన ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలిసింది. అయితే పాక్ తో సైనిక ఘర్షణల నేపథ్యంలో ఇది మరోసారి ఆలస్యం అయింది.
జాతీయ అధ్యక్షుడిని ఎన్నికకు ముందే పార్టీ రాష్ట్ర ఎన్నికలను పూర్తి చేయడానికి పార్టీ ప్రయత్నం చేస్తోంది. ఇది నిజంగా అవివేకపు చర్యగా చెప్పవచ్చు. కానీ తన అదృష్టం మారుతుందని అనుకుంటున్న మోదీ ఈ విషయంలో చాలా మొండిగా ఉంటున్నారు.
తదుపరి నాయకుడు ఎవరనేది గుర్తు పట్టడం, ఎన్నికయ్యే విధానం, సంఘ్ పరివార్ పట్టు నేపథ్యంలో మోదీ మరోసారి తన పట్టును నిలుపుకుంటారో చూడాలి.
ట్రంప్ ఎఫెక్ట్..
గత ఏడాది నుంచి రాహుల్ గాంధీ గట్టిగా ప్రచారం చేస్తున్న కులగణనపై మోదీ యూటర్న్ తీసుకుని దానికి సై అన్నారు. ఇది ఆ పార్టీకి వ్యూహాత్మక విజయం సాధించినట్లే. వచ్చే జనాభా లెక్కల్లో వీటిని చేర్చాలని కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను సైతం విడుదల చేశారు.
ఈ సంబంధాలలో మోదీకి దక్కని ఏదైన విజయం ఉందంటే అది అమెరికాదే. ఆయనతో వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకుని మరింత వేగంతో అమెరికాతో సంబంధాలను నెరుపుకోవాలని అనుకున్నారు. కానీ ఈ పాచిక ఇంకా పారలేదు.
పాకిస్తాన్ తో జరిగిన ఘర్షణల్లో తానే మధ్యవర్తిత్వం వహించానని ట్రంప్ పదేపదే ప్రచారం చేసుకుంటున్నాడు. భారత్ దీనిని ఖండించినప్పటికీ ఆయన నాలిక మాత్రం ఆగట్లేదు. దీనిపై మోదీ తన తదుపరి అడుగు వేయాల్సి ఉంటుంది.
2001 అక్టోబర్ నుంచి మోదీ నిరంతరం ప్రభుత్వ కార్యాలయాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు తన జీవితంలో మరో మైలురాయిని దాటారు. జూన్ 4న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ప్రకటించినప్పటి కంటే జూన్ 9న మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి కంటే ఆయన మరింత సులభంగా ఊపిరి పీల్చుకున్నారు.
(ది ఫెడరల్ అన్ని వైపులా అభిప్రాయాలను గౌరవిస్తుంది. వ్యాసంలోని సమాచారం, ఆలోచనలు, అభిప్రాయాలు వ్యక్తిగతంగా రచయితవి. అవి తప్పనిసరిగా ఫెడరల్ అభిప్రాయాలను ప్రతిబింబిచవు)
Tags:    

Similar News