శ్రీదేవి కూతురు జాహ్నవి ఎగ్రిమెంట్ లో సైన్ చేసి లాక్ అయ్యిపోయిందా?

సినిమా ఓకే చేసేటప్పుడు ఎన్ని రోజులు డేట్స్, ఎంత మనీ ఇస్తున్నారు, ఎంత క్రూ తమతో పాటు రావచ్చు, ఏయే సౌకర్యాలు కల్పిస్తారు వగైరా విశేషాలతో ఎగ్రిమెంట్స్ జరుగుతూంటాయి.

Update: 2024-08-26 10:42 GMT

సినిమా ఓకే చేసేటప్పుడు ఎన్ని రోజులు డేట్స్, ఎంత మనీ ఇస్తున్నారు, ఎంత క్రూ తమతో పాటు రావచ్చు, ఏయే సౌకర్యాలు కల్పిస్తారు వగైరా విశేషాలతో ఎగ్రిమెంట్స్ జరుగుతూంటాయి. అయితే కొన్ని సార్లు అంతకు మించి అన్నట్లు ఉంటాయి. తమ ప్రొడక్షన్ కంపెనీలో వరసగా మూడు సినిమాలు చేయాలని కొందరు ఎగ్రిమెంట్ లో రాసుకుంటారు. అలాగే మూడు సినిమాలకు రెమ్యునరేషన్ గ్యాడ్యువల్ గా పెంచుతామని అంటారు. అలాగే మరికొందరు తమ సినిమా పూర్తయ్యే దాకా వేరే సినిమా కమిటవ్వకూడదంటారు. ప్రమోషన్స్ కు ఖచ్చితంగా రావాలని, ఎగస్ట్రా మనీ డిమాండ్ చేయకూడదని కొందరు నిర్మాతలు కండీషన్ పెడతారు. అలా హీరో,హీరోయిన్స్ కు రకరకాల ఎగ్రిమెంట్స్ ఉంటాయి. అయితే శ్రీదేవి కుమార్తె జాహ్నవి కూడా ఓ కండీషన్ కు సైన్ చేసి తెలుగులో దేవర సినిమా చేస్తోందని సమాచారం.

అందాల తార శ్రీదేవి కూతురుగా జాన్వీ కపూర్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే హిందీ లో ఎన్ని సినిమాలు చేసినా ఆమెకు సరైన బ్రేక్ రాలేదు. సరైన హిట్ పడలేదు. అలా మరో నాలుగు సినిమాలు చేస్తే ఇంక శ్రీదేవి కుమార్తెని మర్చిపోతారనే కామెంట్స్ సైతం వినిపిస్తున్నాయి. అయితే ఎప్పుడైతే తెలుగులో దేవర సినిమాలో బుక్ అయిందో అప్పటి నుంచి దశ తిరగటం మొదలైంది. తెలుగు సినిమా హీరోలు సైతం ఆమెను తమ సినిమాల్లో నటింపచేయాలని అడుగుతున్నారు.

ఎన్టీఆర్ దేవర తరువాత రామ్ చరణ్ -బుచ్చిబాబు సినిమాలో జాన్వీకు కమిటైంది. స్టార్ హీరోలకి తగ్గట్టుగా గ్లామర్‌ పరంగా కూడా ఆమె సరిగ్గా బ్యాలెన్స్ చేయగలదని దేవర నుంచి విడుదలైన “చుట్టమల్లె” పాట ప్రూవ్ చేయటంతో మరింత ఉత్సాహంగా దర్శక,నిర్మాతలు ఆమె చుట్టూ ప్రదిక్షణాలు చేస్తున్నారు. అయితే ఆమె దేవర టీమ్ కు ఓ ఎగ్రిమెంట్ రాసిందని సమాచారం. దాని ప్రకారం ఆమె ముందుకు వెళ్లాలని తెలుస్తోంది.

ఇండస్ట్రీలో చెప్పుకునేదాని ప్రకారం దేవర ప్రొడక్షన్ హౌస్ కు రాసిన ఆ కాంట్రాక్ట్ ఎగ్రిమెంట్ ఏమిటంటే...దేవర చిత్రం రిలీజ్ అయ్యేదాకా ఆమె ఏ సినిమాలోనూ కనిపించకూడదు. అంటే ఆమె సినిమా సైన్ చెయ్యాలంటే దేవర రిలీజ్ టైమ్ దాటిన తర్వాత వచ్చే సినిమాలకే కాంట్రాక్ట్ సైన్ చేయాలి. దాని వల్ద జాహ్నవి నటించిన తొలి చిత్రం తమదే అవుతుందనేది దేవర టీమ్ ఆలోచన. ఎందుకంటే ఖచ్చితంగా శ్రీదేవి కుమార్తె తెరపై ఎలా ఉంటుంది అనేది తెలుగు దర్శక,నిర్మాతలకు మాత్రమే కాకుండా సినీ ప్రేమికులకు ఆసక్తి ఉంది.

ఈ క్రమంలో ఆమె అల్లు అర్జున్ పుష్ప 2 లో ఐటెం సాంగ్ ని రిజెక్ట్ చేసిందని సమాచారం. మొదటి నుంచీ జాన్వీ కపూర్ చేత పుష్ప 2లో ఐటెమ్ నంబర్‌ చేయించాలని సుకుమార్ – అల్లు అర్జున్ ప్లాన్ చేసుకున్నారట. అయితే ఆమె దేవర ప్రొడక్షన్‌తో ఎగ్రిమెంట్ కుదుర్చుకున్న విషయం తెలుసుకుని ఆగిపోయారట. ఎందుకంటే ఆగస్ట్ 15 రిలీజ్ అవుతుందని పుష్ప 2 ప్లాన్ చేసుకున్నారు. ఆ ప్రకారం ఆమె ఐటెం సాంగ్ కనుక చేస్తే కనుక దేవర కన్నా ముందే ఆమె తెరపై కనిపిస్తుంది. కానీ ఎగ్రిమెంట్ ప్రకారం దేవర విడుదలయ్యే వరకు ఆమె ఏ తెలుగు చిత్రంలో నటించకూడదు కాబట్టి ఆగిపోయారు. ఇప్పుడు పుష్ప 2 చిత్రం వాయిదా పడింది. కాబట్టి జాహ్నవి ఒప్పుకుంటుందేమో చూడాలి.

జాహ్నవి మాట్లాడుతూ...‘నా జీవితమంతా నటనకే అంకితం. మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నాను. ఇండస్ట్రీ నన్ను ఎలా చూస్తుందన్న విషయాన్ని నేను చెప్పలేను. పాటలు, డ్యాన్స్‌లు, గ్లామర్‌తో కూడిన కమర్షియల్‌ సినిమాలు చేస్తే.. అది చాలా సులభమైన ప్రయాణం అవుతుంది. విజయం సాధించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. తక్కువ సమయంలోనే ప్రజాదరణ సొంతమవుతుంది. కానీ, నేను రిస్క్‌తో కూడిన పాత్రలను ఎంచుకోవడానికి ఇష్టపడతాను. అందులో నా నటన చూసి ఆశ్చర్యపోవాలని అనుకుంటాను. కొన్ని సంవత్సరాల క్రితమే ఈ నిర్ణయం తీసుకున్నాను. అందులో భాగంగానే చిన్న సినిమాలను ఎంచుకున్నాను. ప్రతి సినిమాలోనూ దర్శకుడు నా నుంచి ఏం కోరుకుంటున్నాడో దాన్ని ఇవ్వడానికి వందశాతం ప్రయత్నిస్తాను. ఇప్పటి వరకు రెండు హైరిస్క్‌ ఉన్న సినిమాలు ఎంచుకున్నాను. ’ అని చెప్పారు.

ఇక ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ డ్రామా ఫిల్మ్‌ ‘దేవర’ (Devara Movie). ఈ చిత్రంతో బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీకపూర్‌ (Janhvi Kapoor) టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ‘దేవర’చిత్రంలో ఆమె పోషించే పాత్ర పేరు ‘తంగం’. అది ఎంతో ఎంటర్టైన్మెమెంట్ గా ఉంటుందని చెప్తున్నారు ఇది విభిన్నమైన కథ. అందంగా, ప్రత్యేకంగా ఉంటుంది. సముద్రతీరం నేపథ్యంలో సాగే యాక్షన్‌ డ్రామా ఇది. పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది . సైఫ్‌ అలీఖాన్‌ విలన్ గా నటిస్తోన్న ఈ చిత్రంలో శ్రీకాంత్‌ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్ర మొదటి భాగాన్ని అక్టోబర్‌ 10న రిలీజ్ చేస్తున్నారు.

Tags:    

Similar News