అమెరికా దాడిలో ఇరాన్ అణు కేంద్రం ధ్వంసం అయిందా?

ఫోర్డో ని తుడిచి పెట్టేశాం అంటున్న ట్రంప్, అయితే, ఇరాన్ దాన్నెపుడో ఖాళీ చేసిందని చెబుతున్నారు.;

Update: 2025-06-22 09:37 GMT

ఇరాన్‌లో, ఓ మారుమూల, మనుషులు చేరుకోవడానికి అత్యంత కష్టతరమైన అణుపరిశోధనా స్థావరం ఫోర్డో మీద బాంబు దాడి చేసింది. దీని మీద ఇదివరకే ఇజ్రే ల్ ఒక సారి దాాడిచేసింది. ఈ స్థావరం ఒక పర్వతంలో పుల, వేయి మీటర్ల దిగువన భూగర్భంలో ఉంటుంది. దీనిని చేధించగల ఆయుధ శక్తి ఇజ్రేల్ దగ్గిర లేదు. అందుకే ఆదేశం ఆమెరికా సాయం కోరింది.రెండు వారాల్లో నిర్ణయం తీసుకుంటానని అధ్యక్షుడు ట్రంప్ చెప్పినా, రెండు రోజరుల్లోనే బాంబర్ ని పంపి ఫోర్డో మీద బాంబులు వేశారు. అయిపోయింది, ఫోర్డో ని తుడిచిపెట్టేశాం అని ట్రంఫు ప్రకటించాడు. అయితే, దాడి జరిగిందని ధృవీకరించింది గాని, తుడిచి పెట్టుకుపోయిందని చెప్పలేదు. దాడులు జరగుతాయని వూహించి ఇరాన్ అక్కడున్న టెక్నాలజీని మరొక చోటికి తరలించిందా? అమెరికా ప్రయోగించిన బాంబు ఏమిటి? ఫోర్డో లో ఏముందో చూద్దాం.

***

ఆదివారం తెల్లవారుజామున అమెరికా ఇరాన్ లోని మూడు ప్రధాన అణు కేంద్రాలపై బాంబు దాడి చేసింది, వాటిని పూర్తిగా తుడిచిపెట్టేశామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.

అమెరికా దాడి చేసిన మూడు స్థావరాల్లో నటాంజ్‌ ఒకటి. దీని మీద జూన్ 13న ఇజ్రేల్ కూడా దాడి చేసింది. ఇది ఇరాన్ లో యురేనియాన్ని ఆణ్వాయుధం కోసం సుసంపన్న(enrich) చేసే ప్రధాన కేంద్రం. మరొక అణుకేంద్రం ఇస్ఫహాన్‌. ఇది నిజానికి ఒక అణు సముదాయం. దీని మీద ఇజ్రాయిల్ దాడి చేసింది. అణు ఇంధనాన్ని శుద్ధి చేయగల మరొక సౌకర్యం ఫోర్డy (Fordow).

జూన్ 13న ఇజ్రాయెల్ క్షిపణులు ఫోర్డోను కూడా తాకినప్పటికీ, మునుపటి దాడిలో ఎటువంటి నిజమైన నష్టం జరగలేదని ఐక్యరాజ్యసమితి అణు నిఘా సంస్థ, అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (IAEA) తెలిపింది. ఫోర్డో లోతైన భూగర్భంలో ఉంది. దీనిని చేరుకోవడం నటాంజ్ కంటే చాలా కష్టం.

ఫోర్డో బాంబు దాడిలో తనకు సహాయం చేయమని ఇజ్రాయిల్ చేసిన అభ్యర్థనలను తాను పరిశీలిస్తున్నానని, ఇజ్రాయిల్ వద్ద లేని ఆయుధాలను తాను ఉపయోగిస్తున్నానని ట్రంప్ ఆ మధ్య ప్రకటించారు.

దీనికి రెండు వారాల గడువు పెట్టుకున్నాడు. దానిలోపు ఇరాన్‌పై దాడి చేయాలా వద్దా అని నిర్ణయించుకుంటానని చెప్పాడు. అయితే, అపుడే దాడి జరిగింది. ఆదివారం తెల్లవారుజామున ముహూర్తం పెట్టుకున్నట్లు తెలుస్తుంది.

"FORDOW IS GONE" అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్‌లో దాడుల తర్వాత పేర్కొన్నారు.

ఫోర్డో మీద దాడికి అమెరికా ఎందుకంత ప్రాముఖ్యం ఇస్తున్నదోచూద్దాం

ఫోర్డో అణు కేంద్రం అంటే ఏమిటి

నిజానికి ఫోర్డూ అనేది ఇస్లామిక్ రెవల్యూషనరీ గాక్డ్స్ కోర్ (Islamic Revolutionary Guard Corps) కోసం నిర్మించిన సైనిక స్థావరం . ఇది ఇరాన్‌లోని కోమ్ నగరానికి ఈశాన్యంలో 30 కి.మీ (18.5 మైళ్ళు) దూరంలో ఉంది. ఇది ఒక పర్వతం లోపల వందల మీటర్లు లోతున ఉన్నట్లు చెబుతారు.

దీనిని తర్వాత ఇరాన్ అణుకేంద్రంగా మార్చేసింది. ఈ విషయాన్ని పాశ్చాత్య నిఘా సంస్థలు పసిగట్టాయని తెలిశాక సెప్టెంబర్ 21, 2009న ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ (IAEA) కి ఒక లేఖ రాస్తూ ఈ సైనిక స్థావరాన్ని తాను అణు కేంద్రంగా మార్చినట్లు ఇరాన్ వెల్లడించింది.

కొన్ని రోజుల తరువాత, అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్, ఫ్రాన్స్ ఫోర్డోలో రహస్య ఇంధన ఎన్ రిచ్ మెంట్ కర్మాగారం గురించి తమకు నిజంగా తెలుసని బహిరంగంగా ధృవీకరించాయి. ఇరాన్ ఆ ప్రదేశంలో 3,000 సెంట్రిఫ్యూజ్‌లను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తోందని నిఘా సంస్థలు 2009 లోనే వెల్లడించాయి..

ఆయుధ-స్థాయి (వెపన్ గ్రేడ్) స్వచ్ఛతకు దగ్గరగా శుద్ధి చేసిన యురేనియం కణాలను IAEA ఫోర్డోలోకనిపెట్టింది. ఇది 2023లో జరిగింది.

ఈ ప్రదేశం 2,976 స్పిన్నింగ్ సెంట్రిఫ్యూజ్‌లను ఉంచుకునేలా రూపొందించారని IAEA తెలిపింది. ఇరాన్ ప్రధాన అణు కేంద్రమైన నాటాంజ్‌లో 50,000 సెంట్రీఫ్యూజ్ల సామర్థ్యంతో పోలిస్తే ఇది చాలా చిన్నది. అయినా సరే అది ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమంలో చాలా కీలకపాత్ర పోషిస్తున్నది. ఇరాన్‌పై వైమానిక దాడులు ప్రారంభించిన రోజునే ఇజ్రాయెల్ నాటాంజ్ మీద దాడి చేసింది.

ఆదివారం అమెరికా దాడిలో ఫోర్డో నాశనమైందా?

ఫోర్డో కేంద్రం ధ్వంసమైందని ట్రంప్ పేర్కొన్నప్పటికీ, ఇరాన్ ఇప్పటివరకు ఆ ప్రదేశంలో ఎంత నష్టం జరిగిందో అధికారికంగా వెల్లడించలేదు. అయితే, ఫోర్డో మీద జరిగిన దాడిని ధృవీకరించింది.

అమెరికా దాడి తర్వాత ఫోర్డో సమీపంలోని నివాసితులు "పెద్ద పేలుడు ఆనవాళ్లు "చూసినట్లు చెప్పలేదని ఇరాన్ అధికారిక వార్తా సంస్థ IRNA తెలిపింది.

"ఆ ప్రాంతంలో పరిస్థితులు పూర్తిగా సాధారణంగా ఉన్నాయి" అని ఈ ఏజెన్సీ తెలిపింది.

ఫోర్డో ఉన్న కోమ్ ప్రావిన్స్‌లోని క్రైసిస్ మేనేజ్‌మెంట్ ప్రధాన కార్యాలయానికి గాని, కోమ్ పరిసర ప్రాంతాల ప్రజలకు గాని ఎటువంటి ప్రమాదం జరగలే లేదు అని ఇరాన్ ఒక ప్రకటన విడుదల చేసింది.

అంతకుముందు, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాగర్ గాలిబాఫ్ సలహాదారు మహదీ మొహమ్మది మాట్లాడుతూ, దాడి జరుగుతుందని ఊహించే అక్కడి అణు మౌలిక సదుపాయాలను ఫోర్డో నుండి తరలించారని అన్నారు.

"ఆ ప్రాంతమంతా చాలా కాలం కిందటే ఖాళీ అయింది. అమెరికా చెబుతున్నట్లు అక్కడ కోలుకోలేని నష్టమేమీ జరగలేదని మొహమ్మది సోషల్ మీడియా పోస్ట్‌లో రాశారు.

జూన్ 16న, ఇజ్రాయెల్ దాడి తర్వాత, IAEA డైరెక్టర్ జనరల్ రాఫెల్ గ్రాస్సీ ఇలా అన్నారు: “ఫోర్డో ఇంధన శుద్ధి కర్మాగారం ఉన్న ప్రదేశంలో గాని, నిర్మాణంలో ఉన్న ఖోండాబ్ హెవీ వాటర్ రియాక్టర్ వద్ద గాని ఎటువంటి నష్టం జరగలేదు.”

ఫోర్డోలో అణు విద్యుత్ కేంద్రం

2009లో ఫోర్డో సైట్ ఉనికి బహిరంగమైన తర్వాత, అమెరికా ఇరాన్ మొదటి ప్రత్యక్ష చర్చలను ప్రారంభించాయి. 30 సంవత్సరాల తర్వాత జరిగిన సమావేశం ఇది.

"ఇరాన్ అణు కార్యక్రమం పూర్తిగా శాంతియుతంగా ఉండేలా పరస్పరం అంగీకారంతో దీర్ఘకాలిక సమగ్ర పరిష్కారాన్ని చేరుకోవడం ఈ చర్చల లక్ష్యం" అని IAEA తెలిపింది.

అక్టోబర్ 2009లో ఇరాన్ ఫోర్డో గురించి సమాచారాన్ని IAEAకి సమర్పించినప్పటికీ, దాని డిజైన్, నిర్మాణం అసలు ప్రయోజనాల టైమ్ టేబుల్ సమర్పించడానికి నిరాకరించింది. UN ఏజెన్సీతో భద్రతా ఒప్పందం ప్రకారం దాని ఈ విషయాలను వెల్లడించవీలులేని వని ఇరాన్ పేర్కొంది..

రెండు సంవత్సరాల తరువాత, సెప్టెంబర్ 2011లో, అప్పటి IAEA డైరెక్టర్ జనరల్ యాకియా అమనో, ఇరాన్ "20 శాతం వరకు యురేనియంను ఎన్ రిచమెంట్ ఉత్పత్తి చేయాలనే ప్రకటిత లక్ష్యంతో ఫోర్డోలో సెంట్రిఫ్యూజ్‌లను ఏర్పాటు చేసిందని" వెల్లడించారు.

మార్చి 2012 నాటికి, ఫోర్డోలో 20 శాతం-ఎన్ రిచ్డ్ యురేనియం నెలవారీ ఉత్పత్తి మూడు రెట్లు పెరిగిందని అమనో నివేదించారు. ఎందుకంటే అప్పటికే నాలుగు సెంట్రిఫ్యూజ్‌ల క్యాస్కేడ్‌లు మొదటిసారిగా ఒకేసారి పనిచేయడం ప్రారంభించాయి.

యురేనియం ఎన్ రిచ్ మెంట్ అనేది సహజ యురేనియంలో యురేనియం-235 ఐసోటోప్ సాంధ్ర తను పెంచే ప్రక్రియ. సాధారణంగా నాచురల్ యురేనియంలో 0.7 శాతం U-235 మాత్రమే కలిగి ఉంటుంది. అణ్వాయుధాన్ని నిర్మించడానికి, యురేనియంను దాదాపు 90 శాతం U-235 కు ఎన్ రిచ్ చేయాలి. ఆ స్థాయికి ఎన్ రిచ్ అయిన యురేనియంను "ఆయుధ-గ్రేడ్" (weapon grade)గా పరిగణిస్తారు.

2015 లో, ఇరాన్, చైనా, రష్యా, అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, యుకె, యూరోపియన్ యూనియన్ లు ఒక జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ (JCPOA) పై సంతకం చేశాయి. దీని తర్వాత ఇరాన్ అణు కార్యక్రమంపై కఠినమైన ఆంక్షలను విధించింది.

2015లో ఇరాన్ ఫోర్డోలో 2,700 సెంట్రిఫ్యూజ్‌లను ఏర్పాటు చేసినట్లు వెల్లడయింది.

JCPOA కింద ఇరాన్ ఏమి అంగీకరించింది?

JCPOA చర్చలు సాగుతున్నపుడు, ఇరాన్ జనవరి 2014 నాటికి ఫోర్డోలో ఉత్పత్తిని నిలిపివేసింది. అక్కడ అణు ఇంధనం గురించి "ఎటువంటి పురోగతి" లేదని IAEA నివేదించింది. ఇరాన్ తన సుసంపన్న యురేనియం నిల్వలను 5 శాతం స్వచ్ఛతకు కూడా కరిగించింది.

JCPOA ఫోర్డోలో అణు సుసంపన్నతను నిషేధించింది, ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయడానికి బదులుగా ఇంధన ఉత్పత్తి కోసం ఇరాన్‌లో అణు సాంకేతిక పరిజ్ఞానం శాంతియుత అభివృద్ధిని మాత్రమే అనుమతించింది.

ఇరాన్ 15 సంవత్సరాల పాటు ఫోర్డోలో యురేనియం ఎన్ రిచ్ చేయడానికి, యురేనియం ఎన్ రిచ్ మెంట్ పరిశోధనలకు దూరంగా ఉండటానికి అంగీకరించింది. అక్కడ ఎటువంటి అణు పదార్థాలను ఉంచకూడదని, బదులుగా ఫోర్డో సౌకర్యాన్ని అణు, భౌతిక, సాంకేతిక కేంద్రంగా (Nuclear, physics and technology centre) మార్చడానికికూడా అంగీకరించింది.

1,000 కంటే ఎక్కువ సెంట్రిఫ్యూజ్‌లను అక్కడే ఉంచడానికి అనుమతించారు. మిగిలినవి నాటాన్జ్‌కు తరలించబడ్డాయి. ఇది జనవరి 2017 నాటికి పూర్తయిందని IAEA తెలిపింది.

ఫోర్డోలో రహస్య అణు అభివృద్ధి ?

JCPOA నిఘా ఉన్నప్పటికీ, ఫోర్డో సౌకర్యంపై ఆందోళనలు ఊహాగానాలు కొనసాగాయి.

2016లో రష్యన్ S-300 వైమానిక రక్షణ వ్యవస్థను ఆ సౌకర్యం పైనే ఇరాన్ ఏర్పాటు చేసింది. అంటే ఈ అణు స్థావరం మీద ఎపుడో ఒక సారి ప్రత్యక్ష వైమానిక దాడి జరుగుతుందని ఇరాన్ భయపడుతూనన ఉందని అనిపిస్తుంది.

2018లో ట్రంప్ ఏకపక్షంగా JCPOA నుండి వైదొలిగారు. యూరోపియన్ భాగస్వాములు ఒప్పందాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, ఇరాన్ కూడా క్రమంగా దాని పరిమితుల నుండి విముక్తి పొందింది.

జనవరి 2023లో జరిగిన అప్రకటిత తనిఖీ జరిగింది. ఇరాన్ ఫోర్డో వద్ద రెండు సెట్ల సెంట్రిఫ్యూజ్‌లను అనుసంధానించిందని, తద్వారా యురేనియంను 60 శాతం స్వచ్ఛతకు సుసంపన్నం చేయడానికి వీలు కల్పించిందని IAEA పేర్కొంది. ఇది టెహ్రాన్ UN ఏజెన్సీతో చేసుకున్న భద్రతా ఒప్పందానికి విరుద్ధంగా ఉందని కూడా ఈ సంస్థ పేర్కొంది.

ఫోర్డో సౌకర్యాన్ని ఏది నాశనం చేయగలదు?

ఇజ్రాయెల్ ఒక కమాండో యూనిట్‌ను ఫోర్డో లోపలికి పంపి పేలుడు పదార్థాలను భౌతికంగా అమర్చితే తప్ప ఆ సదుపాయంలోకి చొచ్చుకుపోయే మార్గాలు లేవు- ఇది ప్రమాదకర ఆపరేషన్.

ఫోర్డో ఇంధన శుద్ధి కర్మాగారం నాటాంజ్ కంటే చాలా కష్టమైన లక్ష్యంగా పరిగణించబడుతున్నది. ఎందుకంటే ఇది ఒక పర్వతం లోపల ఉంది.

అయితే, అమెరికా వద్ద ఫోర్డోను సైద్ధాంతికంగా నాశనం చేయగల బాంబు ఉంది. మాసివ్ ఆర్డినెన్స్ పెనెట్రేటర్ ( Massive Ordnance Penetrator) దాని బరువు 13,600 కిలోలు (30,000 పౌండ్లు). ఈ బాంబులను B-2 బాంబర్ నుండి పడవేస్తే, అవి ఫోర్డో భూగర్భ బంకర్లను కూల్చివేసే అవకాశం ఉంది.

ఆదివారం జరిగిన దాడిలో బి-2 బాంబర్లను ఉపయోగించారని ట్రంప్ పరిపాలన ధృవీకరించింది. అయితే, ఏ బాంబులను ఉపయోగించారనే దానిపై అమెరికా ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు.

Tags:    

Similar News