ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు చేశాం: డొనాల్డ్ ట్రంప్

ఇజ్రాయెల్ దీర్ఘకాల శత్రువును బలహీనపరిచే చర్యగా సమర్థించుకున్న వైట్ హౌజ్;

Update: 2025-06-22 06:47 GMT
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్

ఇరాన్ - ఇజ్రాయెల్ వివాదంలోకి అమెరికా దూరింది. ఇరాన్ లోని మూడు అణుకేంద్రాలపై యూఎస్ బాంబర్లు దాడి చేసి నాశనం చేశాయి. ఇజ్రాయెల్ దీర్ఘకాలిక శత్రువును బలహీనపరించేందుకు యూఎస్ బరిలోకి దూకిందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు.

అమెరికా దాడితో పశ్చిమాసియాలో పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇది విస్తృత ప్రాంతీయ ఘర్షణకు దారి తీసే అవకాశం ఉందని సైనిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అమెరికా తమపై దాడి చేసే పరిస్థితి చేయి దాటుతుందని ఇరాన్ ఇంతకుముందే హెచ్చరిక జారీ చేసింది. అయినప్పటికీ వాషింగ్టన్ మొదట దాడిని ఆపినట్లే ఆపి ప్రస్తుతం తమ పని పూర్తి చేశారు.

వారం దాటిన..
ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్దం ఇప్పటికే వారం పూర్తి చేసుకుంది. ఇరు పక్షాలు ఒకరిపై ఒకరు ఎక్కడా తగ్గకుండా దాడులు చేసుకుంటున్నారు.
టెహ్రన్ లోని కీలక సైనిక స్థావరాలే లక్ష్యంగా ఐడీఎఫ్ దాడులు చేస్తుండగా, ఇజ్రాయెల్ దేశం లక్ష్యంగా ఇరాన్ క్షిపణుల వర్షం కురిపిస్తోంది. ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇప్పటికే టెహ్రన్ లో 500 మందికి పైగా ప్రజలు మరణించారు. తాజాగా ఈ వివాదంలో అమెరికా జోక్యం చేసుకుంది.
భారీ స్టెల్త్ బాంబర్లు..
ఇరాన్ భూగర్భంలో నిర్మించిన భారీ అణు స్థావరాలే లక్ష్యంగా అమెరికా స్టెల్త్ బాంబర్లు దాడులు చేసినట్లు యూఎస్ ప్రకటించింది. ఇందుకోసం 13,500 కిలోల భారీ బంకర్ బస్టర్ బాంబుల ప్రయోగించారు.
‘‘ఫోర్డో, నతాంజ్, ఇస్పహాన్’’ సహ మిగిలిన ప్రధాన అణు కేంద్రాలపై విజయవంతంగా దాడులు పూర్తి చేశాం’’ అని ట్రంప్ శనివారం రాత్రి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
‘‘ఇప్పుడు అన్ని విమానాలు ఇరాన్ నుంచి సురక్షితంగా బయటకు వెళ్లాయి. ఫోర్డోలో పూర్తి స్థాయి బాంబులు జారవిడిచారు. విమానాలన్నీ సురక్షితంగా గమ్యస్థానాలకు వెళ్తున్నాయి’’ అని ఆయన ట్వీట్ చేశారు.
దాడుల కోసం ప్రత్యేకంగా బీ-2 బాంబర్లు వినియోగించినట్లు ప్రకటించినప్పటికి ఏ రకం బాంబులు వాడారో మాత్రం వైట్ హౌజ్ వివరించలేదు. ఈ దాడులపై ఇరాన్ తక్షణమే యూఎన్ఎస్సీ సమావేశం కోరింది.
జెనీవాలో నిన్న నాలుగు గంటల పాటు శాంతి చర్చలు జరిగిన అవి సఫలం కాలేదు. ఇజ్రాయెల్ దూకుడు తగ్గితేనే తాము అమెరికాతో శాంతి చర్చల గురించి ఆలోచిస్తామని టెహ్రాన్ విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు. ఇప్పుడు అమెరికా దాడితో ఇక రాబోయే కొన్ని రోజుల వరకూ వాటికి అవకాశం కనిపించడం లేదు.


Tags:    

Similar News