భారత్ తో చర్చలకు సిద్దంగా ఉన్నాం: పాక్ ప్రధాని

సౌదీ అరేబియా యువరాజు సల్మాన్ తో ఫోన్ లో మాట్లాడిన షరీఫ్;

Update: 2025-06-25 11:47 GMT
పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్

జమ్ము కశ్మీర్ అంశం, ఉగ్రవాదం సహ అన్ని సమస్యలను పరిష్కరించడానికి భారత్ తో చర్చలు జరపడానికి పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ తన సంసిద్దతను వ్యక్తం చేశారు.

పహల్గామ్ లో పర్యటిస్తున్న పర్యాటకుల్లో హిందూవులను గుర్తించి కాల్చి చంపిన తరువాత భారత్ ఆపరేషన్ సిందూర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. పాక్ ప్రధాన భూభాగంతో సహ, పీఓజేకేలో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడులు చేసింది.

ఆ తరువాత రెండు దేశాల మధ్య ఐదు రోజుల పాటు సైనిక ఘర్షణ జరిగింది. తరువాత పాక్ తెల్లజెండా ఎగరవేయడంతో యుద్దం ముగిసింది.

చేతులు కలపడానికి సిద్దంగా ఉన్నాము..
సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ తో పాక్ ప్రధాని షరీఫ్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్, నీరు, వాణిజ్యం, ఉగ్రవాదం వంటి అన్ని అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై భారత్ తో చర్చలు జరపడానికి సిద్దంగా ఉన్నట్లు రేడియే పాకిస్తాన్ నివేదించింది.
సౌదీకి కృతజ్ఞతలు..
పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా మే 7 భారత్ పాక్ పై భీకర స్థాయిలో విరుచుకుపడింది. ఈ సమయంలో ఇస్లామాబాద్ కు సౌదీకి మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ దాడులతో నాలుగు రోజుల పాటు జరిగిన ఘర్షణలు మే 10 నిలిపివేశారు.
భారత్ వైఖరి..
పాక్ తో చర్చలంటూ జరిపితే కేవలం పీఓజేకే స్వాధీనంపై మాత్రమే అని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పినట్లుగా ఉగ్రవాదం, చర్చలు కలిసి సాగలేవు.
ఉగ్రవాదం, వాణిజ్యం కలిసి సాగలేవు. నీరు, రక్తం ప్రవహించలేవని న్యూఢిల్లీ చాలా సందర్భాల్లో ప్రకటించింది. పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం మానుకునే వరకూ సింధు జల ఒప్పందం నిలిపివేస్తామని విదేశాంగమంత్రి రణధీర్ జైస్వాల్ అన్నారు.
ఇరాన్- ఇజ్రాయెల్ వివాదం..
పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితి గురించి షరీఫ్ - సల్మాన్ మాట్లాడుకున్నారు. ఇరాన్- ఇజ్రాయెల్ వివాదం తక్షణం నిలిపివేయాలని రెండు దేశాలు చర్చలు, దౌత్యం ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని అన్నారు.
శాంతియుత పరిష్కారినికి ఇస్లామాబాద్ పూర్తి మద్దతు ఇస్తుందని షరీఫ్ అన్నారు. తనకు ఫోన్ చేసినందుకు ఆయన క్రౌన్ ప్రిన్స్ కు ధన్యవాదాలు తెలిపారు.
పహల్గామ్ దాడి తరువాత భారత్ సైనిక శిక్షాత్మక దౌత్య చర్యలు తీసుకుంది. వాటిలో కీలకమైన సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయడం, పాకిస్తాన్ తో అన్ని వాణిజ్యలను నిలిపివేయడం వంటివి ఉన్నాయి.
ఈ ఒప్పందం ప్రకారం తన వాటా నీటిని మళ్లించడానికి చేసే ఏ ప్రయత్నమైన యుద్ధ చర్యగా పరిగణించబడుతుందని గతంలో ఇస్లామాబాద్ బెదిరించింది.
Tags:    

Similar News