Israel-Iran conflict: ముగ్గురిని ఉరితీసిన ఇరాన్..
‘ప్రపంచంలో అత్యధికంగా ఉరిశిక్షలు అమలు చేస్తున్న దేశాల్లో ఇరాన్ రెండో స్థానంలో ఉంది’ - మానవ హక్కుల సంస్థలు;
ఇజ్రాయేల్కు గూఢచర్యం చేశారన్న ఆరోపణలతో ఇరాన్ బుధవారం ముగ్గురిని ఉరితీసింది. హత్యా సామాగ్రిని దేశంలోని తీసుకొచ్చారన్న ఆరోపణలతో ఇద్రిస్ ఆలీ, అజాద్ షోజాయి, రసూల్ అహ్మద్ రసూల్ను ఉరితీశారు. పశ్చిమ అజర్బైజాన్ ప్రాంతంలోని ఉర్మియా జైలులో ఉరిశిక్ష అమలు చేశారు. ఇజ్రాయేల్తో యుద్ధం మొదలైన తర్వాత ఇరాన్ ఇప్పటి వరకు ఆరుగురికి గూఢచర్యం కేసుల్లో ఉరి వేసింది.
600లకు పైగా మృతులు..
యుద్ధంలో ఇప్పటివరకు 606 మంది మరణించారని, 5,332 మంది గాయాలయ్యాయని ఇరాన్ ప్రభుత్వం తెలిపింది. అయితే ఇజ్రాయేల్ దాడుల్లో 1,054 మంది చనిపోయారని, 4,476 మందికి గాయపడ్డారని ‘హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్’ అంచన వేసింది. మృతుల్లో 417 మంది పౌరులు కాగా.. 318 మంది భద్రతా సిబ్బంది ఉన్నారని పేర్కొంది.
ఇరాన్ ఇటీవల విదేశీ గూఢచారులపై ఉరిశిక్షలు వేగంగా అమలు చేస్తోంది. ఆదివారం, సోమవారం రోజులు కూడా ఇలాంటి ఉరిశిక్షలు నమోదయ్యాయి. ప్రపంచంలో అత్యధికంగా ఉరిశిక్షలు అమలు చేస్తున్న దేశాల్లో ఇరాన్ రెండో స్థానంలో ఉందని మానవ హక్కుల సంస్థలు పేర్కొంటున్నాయి.