ఇరాన్ కు ఆర్థిక సాయమా.. అలాంటిదేమీ లేదే: ట్రంప్
న్యూస్ ఛానెల్స్ పై నోరు పారేసుకున్న అధ్యక్షుడు, ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలంటూ చురకలు;
By : Praveen Chepyala
Update: 2025-06-28 12:25 GMT
ఇరాన్ అణు కార్యక్రమాన్ని ఆపడానికి 30 బిలియన్ డాలర్ల నిధులు మంజూరు చేయడాన్ని తన పరిపాలన శాఖ పరిశీలిస్తున్నట్లు వచ్చిన వార్తలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం ఖండించారు.
టెహ్రన్ ను ఈ విధంగా దారి తీసుకురావాలని ఈ విధానం ఉత్తమమని అనేక మంది మీడియా సంస్థలు చేస్తున్న వార్తలను ఆయన విమర్శించారు.
నకిలీ వార్తలు..
మీడియా సంస్థలను ‘‘ఫేక్ న్యూస్ వీడియో’’ అని పిలుస్తూ ట్రూత్ సోషల్ ఓ పోస్ట్ చేశారు. ఆయన వీడియో మాట్లాడుతూ.. ‘‘ఇంతటి హాస్యాస్పదమైన ఆలోచన’’ అని, తాను ఎప్పుడూ వినలేదని అన్నారు.
‘‘అధ్యక్షుడు ట్రంప్ సైనికేతర అణు సౌకర్యాలను నిర్మించడానికి ఇరాన్ 30 బిలియన్ డాలర్లు ఇవ్వాలనుకుంటున్నారు. ’’ అని స్లీజ్ బ్యాగ్ చెబుతున్న ఫేక్ న్యూస్ మీడియాలో ఎవరు ఉన్నారు?
ఈ హాస్యాస్పదమైన ఆలోచన గురించి నేను ఎప్పుడూ వినలేదు. ఫేక్ న్యూస్ ద్వారా అమెరికాను కించపరచడానికి చేసిన మరొక మోసపూరిత ప్రచారం. ఈ వ్యక్తులు అనారోగ్యంతో ఉన్నారు.’’ అని ట్రంప్ ట్రూత్ సోషల్ విమర్శించారు.
30 బిలియన్ డాలర్ల నిధి..
సీఎన్ఎన్ నివేదిక ప్రకారం.. ట్రంప్ పరిపాలన ఇరాన్ తన విద్యుత్ డిమాండ్ ను తీర్చడానికి పౌర అణు కార్యక్రమాన్ని నిర్మించడానికి 30 బిలియన్ల నిధిని అందించేందుకు సిద్ధపడింది.
ఇజ్రాయెల్-ఇరాన్ తీవ్ర సైనిక వివాదం సమయంలో ట్రంప్ పరిపాలన, మధ్య ప్రాచ్యంలోని ప్రధాన శక్తుల నుంచి ప్రముఖ అధికారులు ఇరాన్ ను సంప్రదించారని నివేదిక పేర్కొంది.
నివేదిక ప్రకారం.. ఆంక్షలను సడలించడం, అమెరికా స్తంభింపజేసిన బిలియన్ డాలర్ల ఇరాన్ నిధులు విడుదల చేయడం ఇందులో ముఖ్యమైనవి. అలాగే ఈ షరతుల్లోనే విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన యురేనియం సంపన్నత కూడా ఉందని తెలిసింది.
అణు చర్చలు లేవు..
ఇరాన్ లోని మూడు అణు కేంద్రాలపై అమెరికా వైమానిక దాడుల తరువాత పరిస్థితి మారిపోయింది. ఇరాన్ తన అణు కార్యక్రమానికి సంబంధించి ట్రంప్ పాలనా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి కఠినంగానే వ్యవహరిస్తున్నారు.
ఇరాన్ విదేశాంగమంత్రి అబ్బాస్ అరాగ్చి మాట్లాడుతూ.. ‘‘అధిక తీవ్రమైన నష్టాన్ని చవిచూశాయి’’ అని అంగీకరించారు. దాని అణు కార్యక్రమానికి సంబంధించి అమెరికాతో చర్చలు ప్రారంభించే అవకాశం లేదని తెలిపారు. ఇరాన్ ప్రజల ఆసక్తి ఏమిటో తమ దేశం పరిశీలిస్తోందని అన్నారు.
ఇటీవల ఇరాన్ పార్లమెంట్ అంతర్జాతీయ అణుశక్తితో సహకారాన్ని నిలిపివేసే బిల్లును ఆమోదించింది. దీనిని అమలు చేస్తే ఇరాన్ ఇకపై అణు పరిశీలకులను దాని ప్లాంట్లలోకి ఆమోదించాల్సిన అవసరం లేదు.