ముగ్గురు మిత్రులు, భారత శత్రువుల ఐకమత్యం
న్యూఢిల్లీకి ఆందోళన కలిగించేలా సరిహద్దు పరిణామాలు;
By : Pranay Sharma
Update: 2025-06-30 12:26 GMT
భారత వ్యతిరేక శక్తులు ఒక జట్టుగా మారాయి. ఈ నెల ప్రారంభంలో మన సరిహద్దు దేశాలైన బంగ్లాదేశ్, పాకిస్తాన్ లు కమ్యూనిస్టు దేశమైన చైనా లోని కున్మింగ్ లో ఇవి సమావేశం అయ్యాయి.
ఈ దేశాలతో న్యూఢిల్లీ సంబంధాలు ప్రస్తుతం చెప్పుకోదగిన స్థితిలో లేవు. ఏప్రిల్ లో పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రధాన సూత్రధారిగా ఉన్న పాక్ సైనిక జనరల్ మునీర్ ను ఒంటరిని చేయాలన్న భారత్ ప్రచారాన్ని ఈ మధ్య అగ్రదేశాలు పట్టించుకోలేదు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌజ్ లో పాక్ ఆర్మీ జనరల్ తో విందు సమావేశానికి ఆహ్వానించారు. ఇదే కాలంలో ఏకకాలంలో జరిగింది.
ట్రంప్ పరిపాలనలో, బంగ్లాదేశ్ పై దాని విధానం ఏమిటన్నది ఇంకా అనిశ్చితంగానే ఉంది. ఇండో - పసిఫిక్ ప్రాంతంలో చైనా నుంచి వచ్చే సవాల్ ను ముఖ్యంగా ఢాకాలో దాని ప్రభావాన్ని పెరుగుతున్న తీరును అది ఎలా తీసుకుంటుందో కూడా స్ఫష్టంగా తెలియట్లేదు.
ఈ సమావేశాన్ని బంగ్లాదేశ్ అనధికారిక సమావేశం అని పిలిచింది. కానీ పాకిస్తాన్ ఇది మూడు దేశాల మధ్య త్రైపాక్షిక ఒప్పందం ప్రారంభోత్సమని పేర్కొంది.
ఢిల్లీ ఆందోళన..
వాణిజ్యం, వ్యవసాయం, సముద్ర వ్యవహరాలు, సంస్కృతి, విద్య అంశాలపై మెరుగైన సహకారం కోసం విదేశాంగ కార్యదర్శుల స్థాయిలో జరిగిన మూడు దేశాల కున్మింగ్ సమావేశం కచ్చితంగా లోతైన సంబంధాలకు దారితీసే అవకాశం ఉంది.
అలా జరిగితే భవిష్యత్ లో జరిగే త్రైపాక్షిక సమావేశం వాణిజ్యం, సంబంధిత అంశాలకే పరిమితం కాకుండా , ఇంకా కీలక రంగాలకు విస్తరించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిణామాలను భారత్ నిశితంగా గమనిస్తోందని విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు.
‘‘మా పొరుగు ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలను మేము నిరంతరం గమనిస్తూనే ఉంటాయి. ఇవి మా ఆసక్తులు, భద్రతను, వ్యక్తిగత దేశాలతో మా సంబంధాలను ప్రభావితం చేస్తాయి.’’ అని జైస్వాల్ అన్నారు.
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి విదేశాంగ సలహదారు తౌహిద్ హుస్సేన్ మాట్లాడుతూ.. ఈ త్రైపాక్షిక సమావేశం ఏ మూడవ దేశాన్ని లక్ష్యంగా చేసుకుని కూటమిని నిర్మించుకోవడానికి ఉద్దేశించలేదని అన్నారు.
భారత్ నుంచి విడిపోయినవి..
ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం హార్మూజ్ జలసంధిని మూసివేతకు దారి తీసే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ పరిణామం చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ లను కలవరపెట్టింది.
ఈ మూడు దేశాలు కూడా గల్ఫ్ నుంచి వచ్చే చమురు, గ్యాస్ సరఫరాపై ఆధారపడి ఉన్నాయి. సరఫరాలో అంతరాయం, చమురు ధరల పెరుగుదల వాటి ఆర్థిక వ్యవస్థ పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.
ముఖ్యంగా ఇప్పటికే మూలుగుతున్న పాక్, బంగ్లాదేశ్ లకు ఇది తాటికాయ పడ్డ చందంగా మారుతుంది. ఈ చమురు సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ఒకదానితో ఒకటి సన్నిహితంగా ఉంటూ మెరుగైన సహకారం కల్పించుకోవడానికి వేదికను ఏర్పాటు చేసుకున్నాయి.
ఇటీవల నెలల్లో భారత్ తో ఈ మూడు దేశాల సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చైనా వాటిని ఇలా వేదికపైకి తీసుకురావడానికి కీలకంగా వ్యవహరించిందని చెప్పడానికి వేరే విశ్లేషణలు అవసరం లేదు.
‘‘చైనా- పాకిస్తాన్- బంగ్లాదేశ్ మధ్య త్రైపాక్షిక శిఖరాగ్ర సమావేశం జరగడం చూస్తుంటే ఈ దేశాల మధ్య పెరుగుతున్న భౌగోళిక రాజకీయ సత్సంబంధాలను తెలుపుతుంది’’ అని బంగ్లాదేశ్ లోని గోపాల్ గంజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ సంబంధాలను బోధించే హిమేల్ రెహమాన్ అన్నారు.
మే నెలలో పహల్గామ్ ఉగ్రవాద దాడి తరువాత భారత్- పాక్ మధ్య స్వల్ఫకాలిక సైనిక సంఘర్షణ జరిగింది. రెండు దేశాలు తరువాత కాల్పుల విరమణకు అంగీకరించి, వివాదాన్ని ముగించాయి.
ఈ యుద్ధంపై ప్రపంచవ్యాప్తంగా తమ వాదనలు వినిపించేందుకు, ప్రచార యుద్దంలో పైచేయి సాధించేందుకు రెండు దేశాలు కూడా ప్రతినిధులను పంపాయి.
భారత్- పాకిస్తాన్ సంబంధాలలో ప్రస్తుతం ప్రశాంతత నెలకొని ఉండగా, ఢిల్లీ- బీజింగ్ తో కలిసి వారి అనధికారిక సరిహద్దు అయిన వాస్తవ నియంత్రణ రేఖ వద్ద నాలుగు సంవత్సరాల సైనిక ప్రతిష్టంభన తరువాత ఇప్పుడిప్పుడే ప్రశాంత పరిస్థితులు నెలకొన్నాయి.
ప్రభావం కోసం పోరాటం..
గత కొన్ని సంవత్సరాలుగా దక్షిణాసియా దేశాలపై ప్రభావాన్ని స్థాపించడానికి భారత్- చైనా కూడా పోరాటంలో నిమగ్నమై ఉన్నాయి. చైనా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కింద దక్షిణాసియాలో మౌలిక సదుపాయాల అభివృద్ధిలో బిలియన్ల డాలర్లను పెట్టుబడి పెడుతోంది. ఇది తన అడుగుజాడలను గణనీయంగా విస్తరించడంలో విజయం సాధించింది.
బీఆర్ఐ, చైనా ఉద్దేశాల గురించి భారత్ కు అనేక సందేహాలు ఉన్నాయి. అయితే దాని ఆఫర్ ను అనేక దేశాలు సంతోషంగా అంగీకరించాయి. వారి మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి చేరారు. దక్షిణాసియా దేశాలకు చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి,పెట్టుబడిదారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ రెండింటికి ప్రధాన ఆయుధ సరఫరాదారు కూడా.
భారత్- షేక్ హసీనా..
గత ఏడాది ఆగష్టులో బంగ్లాదేశ్ లో అధికారంలో ఉన్న షేక్ హసీనాను విద్యార్థులు తిరుగుబాటు చేసి దించేశారు. తరువాత బంగ్లాదేశ్ తో భారత్ సంబంధాలు తెగిపోయాయి.
అప్పటి నుంచి ఆమె భారత్ లోనే ఉంటున్నారు. దక్షిణాసియాలో భారత్ కు అత్యంత సన్నిహితురాలు హసీనా. ఈ ప్రాంతంలో బలమైన భారత వ్యతిరేక భావాల నేపథ్యంలో బంగ్లా ఒక మినహయింపుగా ఉంది.
హసీనా నాయకత్వంలో ఆమె తన దేశంలో గతంలో చురుగ్గా ఉన్న భారత వ్యతిరేక శక్తులను అణచివేసింది. బంగ్లా అభివృద్దికి భాగస్వామిగా భావించే చైనాతో హసీనా మంచి సంబంధాలను కొనసాగించినప్పటికీ భారత్ తో మంచి సంబంధాలను ప్రాధాన్యత ఇచ్చింది. ఫలితంగా దేశంలో పాకిస్తాన్ ఉనికి, పాత్ర పూర్తిగా అణచివేయబడింది.
హసీనా నిష్క్రమణ తరువాత పాకిస్తాన్, బంగ్లాదేశ్ లో దూరడం ప్రారంభించింది. డిసెంబర్ 1971 తరువాత మొదటిసారిగా బియ్యం, చక్కెర, ఇతర వస్తువులు మోసుకెళ్లే పాక్ నౌకలు బంగ్లా ఓడరేవుల్లోకి ప్రవేశించాయి. రాజకీయ, భద్రత, సైనిక నిఘా భాగస్వామ్యంతో సహ వివిధ స్థాయిలు, రంగాలలో సహకారం కోసం ఇరుపక్షాల మధ్య ఇటీవల బంధం బలపడింది.
1960 ల నాటి చేదు జ్ఞాపకాలు..
మూడు దేశాల మధ్య ప్రతిపాదిత త్రైపాక్షిక సహకారం కొత్తది కాదని, 1960 లో వారు అనుసరించిన విధానాన్ని పునరుద్దరించే ప్రయత్నమని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
1962 లో వివాదాస్పద సరిహద్దు విషయంలో చైనా, భారత్ యుద్ధం తరువాత ఇక్కడ బీజింగ్ స్థాయి పెరిగింది. పాకిస్తాన్ తూర్పు ప్రావిన్స్ ను ఇప్పుడు బంగ్లా ను క్రియాశీలం చేయడానికి చైనా- పాకిస్తాన్ దగ్గరకు వచ్చాయి.
భారత్ కు దాని ఈశాన్య ప్రాంతంలో సమస్యలను సృష్టించింది. మావో జెడాంగ్ సిద్దాంతంతో మిజోరాం, నాగాలాండ్, మణిపూర్ లో తిరుగుబాటుదారులను ప్రొత్సహించారు.
చైనా ఇప్పుడు తను ఆర్థిక శక్తిగా ఎదగడానికి, ఆసియాలో అగ్రరాజ్యంగా తనను తాను స్థాపించుకోవాలనే దాని వ్యూహత్మక లక్ష్యం అలాగే ఉంది. మణిపూర్ లో స్థిరత్వం, శాంతిని తీసుకురావడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం కష్టపడుతున్న తరుణంలో మూడు దేశాలు కలిసి రావడం మరోసారి ఆందోళన కలిగించే అంశం.
ఇదే సమయంలో బంగ్లాదేశ్ లో ఇస్లామిస్టుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. సైన్యం, ప్రజాస్వామ్య శక్తులు జాతి సాయుధ సముహాల మధ్య జరుగుతున్న పోరాటం, మయన్మార్ లో కొనసాగుతున్న అంతర్యుద్ధం ఇక్కడ భయాలను మరింత పెంచుతున్నాయి.
బంగ్లాదేశ్ లో ఎన్నికలు..
బంగ్లాలో వచ్చే ఏడాదిలో ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడ పార్లమెంటరీ ఎన్నికలు జరగడమే ఉత్తమ పరిష్కారం అని పరిశీలకులు అంటున్నారు. బంగ్లాదేశ్ ల ఆర్థిక వ్యవస్థను పునరుద్దరించడం ద్వారా పరిస్థితిని సాధారణీకరించడానికి ఎన్నికైన ప్రభుత్వం ఉత్తమమైనదని పరిశీలకులు చెబుతున్న మాట.
భారత పార్లమెంట్ విదేశాంగ సంబంధాల కమిటీ బంగ్లాదేశ్ తో సంబంధాలను పునరుద్దరించడానికి సిఫార్సు చేసింది. దీనికోసం అన్ని అంశాలను చర్చించాలని నిర్ణయించింది.
భారత్- బంగ్లాదేశ్ సంబంధాలను తిరిగి గాడిలో పెట్టడానికి ప్రభుత్వం సంభాషణను తిరిగి ప్రారంభించడానికి ఇది కనీసం ప్రారంభం కావచ్చు. ఈ చర్య రెండు పొరుగు దేశాలకు ప్రయోజనకరంగా ఉండే అవకాశం ఉంది.