వచ్చే ఏడాది బంగ్లాలో ఎన్నికలు సాధ్యమవుతాయా?

బీఎన్పీ- యూనస్ మధ్య ఒప్పందాలు, క్షేత్ర స్థాయిలో మాత్రం ఘర్షణలు;

By :  47
Update: 2025-06-17 11:54 GMT
బంగ్లాదేశ్ తాత్కాలిక పాలకుడు మహ్మద్ యూనస్

వచ్చే ఏడాది ప్రారంభంలో అంటే ఫిబ్రవరి 2026 లో బంగ్లాదేశ్ పార్లమెంటరీ ఎన్నికలు నిర్వహించడానికి అంతా సిద్దం చేస్తున్నారు. ఈ తరుణంలో తాత్కాలిక అధిపతి మహ్మద్ యూనస్, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నాయకుడు తారిక్ రెహమాన్ ముందు అనేక సవాళ్లు ఉన్నాయి.

ఈ ఏడాది చివరి నాటికి దేశంలో ఎన్నికలు జరగాలని పార్టీ కార్యకర్తల్లోని ఒక వర్గం డిమాండ్ చేస్తోంది. పార్టీలో చెలరేగిన అసమ్మతిని కంట్రోల్ చేయడం ఇప్పుడు తారిక్ ముందున్న అతిపెద్ద సవాల్. రాజకీయంలోకి దిగుతున్న నేపథ్యంలో ఆయన అంతర్గత ఒత్తిడిలను అదుపు చేయడం రాబోయే నెలల్లో ఆయన నాయకత్వానికి పెద్ద పరీక్ష.

ఇక యూనస్ విషయానికి వస్తే ఆయన కింద పనిచేస్తున్న అధికార గణాన్ని ఏప్రిల్ బదులుగా ఫిబ్రవరి లోనే ఎన్నికలు చేయాలని ఒప్పించడం సవాల్. ఎందుకంటే ఆయన వర్గంలోని చాలా మంది వచ్చే ఏడాది చివరి నాటికే ఎన్నికలు నిర్వహించాలని, ముందస్తు ఎన్నికలు జరపకూడదని భావిస్తున్నారు.
నెలల తరబడి నెలకొన్న అనిశ్చిత పరిపాలన, ఆర్థిక వ్యవస్థ పతనం, దేశ భవిష్యత్ గురించి ప్రజల మనస్సులో మొలకెత్తిన అశాంతిని చల్లార్చడానికి సార్వత్రిక ఎన్నికలు ఉపశమనం కలిగిస్తాయని చాలామంది పరిశీలకులు భావిస్తున్నారు.
దేశం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను పరిష్కరించడానికి, బంగ్లాలో ప్రజాస్వామ్య ప్రక్రియ సరైన మార్గంలో ఉందని ప్రపంచానికి భరోసా ఇవ్వడానికి ఎన్నికైన ప్రభుత్వమే మంచి మందని ప్రజలంతా నమ్ముతారు.
బంగ్లాదేశ్ లో జరగబోయే ముందస్తు ఎన్నికలు కూడా భారత్ కు అనుకూలంగా మారవచ్చు. తాత్కాలిక ప్రభుత్వం కంటే ఎన్నికైన ప్రభుత్వంతో చర్చలు జరపడానికి, దాని విధానాలు అర్థం చేసుకోవడానికి ప్రజాస్వామ్యం బాగా ఉపయోగడపడుతుంది.
ఆ ఇద్దరి సమావేశం..
బంగ్లాదేశ్ లో అధికారంలో ఉన్న తాత్కాలిక ప్రభుత్వానికి, ప్రధాన ప్రతిపక్షమైన బీఎన్పీకి మధ్య విభేదాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో యూనస్- తారిక్ రెహహాన్ లండన్ లో సమావేశం అయ్యారు.
బీఎన్పీ భవిష్యత్ ప్రతినిధి అయిన తారిక్, యూనస్ మధ్య జరిగిన తొలి సమావేశం ఇదే. ఇది విభేదాలను తొలగించి వారి మధ్య మెరుగైన అవగాహనకు పునాది వేసిందని బంగ్లాదేశ్ పరిశీలకులు అంటున్నారు.
బంగ్లాదేశ్ లో చివరి పార్లమెంటరీ ఎన్నికలు జనవరి 2024 లోనే జరిగాయి. ఆ ఎన్నికల్లో అవామీ లీగ్ కు చెందిన షేక్ హసీనా ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికలను ప్రతిపక్ష పార్టీలు బహిష్కరించాయి.
ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రారంభమైన విద్యార్థుల నిరసన తరువాత దేశ వ్యాప్తంగా తిరుగుబాటు చెలరేగడంతో ఆగష్టులో హసీనా అధికారం నుంచి తొలగించబడ్డారు. దేశాన్ని ఎక్కువ కాలం పరిపాలించిన నేతగా హసీనా పేరు ఇంకా ఉంది. ప్రస్తుతం ఇప్పుడు న్యూఢిల్లీ ప్రవాసంలో ఉన్నారు.
‘‘20 సంవత్సరాలలో మొదటిసారిగా బంగ్లాదేశ్ లోని ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోగలుగుతారు.’’ అని బీఎన్పీ సీనియర్ నాయకుడు అమీర్ ఖుస్రో మహమూద్ చౌదరి ఢాకాలో అన్నారు.
లండన్ లో ఇద్దరు నాయకుల మధ్య జరిగిన సమావేశాన్ని స్వాగతించారు. ఈ ఫలితం ప్రజాస్వామ్య ప్రక్రియ సరైన మార్గంలో సాగుతోందనే భరోసా ఇచ్చిందని ఖుస్రో అన్నారు. అయితే లండన్ లో చర్చించిన దానిపై ఇప్పుడు పార్టీ నాయకులు, కార్యకర్తలలో చర్చ జరుగుతుందని ఆయన ఎత్తి చూపారు.
ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలనే ఒప్పందం యూనస్, రెహమాన్ ఇద్దరికి రాజీ లాంటిది. హసీనా పారిపోయిన తరువాత దేశాన్ని స్థిరీకరించడానికి ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడానికి ప్రపంచ ప్రఖ్యాత ఆర్థికవేత్త యూనస్ ను తాత్కాలిక ప్రభుత్వానికి అధిపతిగా వచ్చారు.
రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి యూనస్ సంస్కరణ కార్యక్రమానికి మద్దతు ఇచ్చిన విద్యార్థి నాయకులు వీరిలో చాలామంది సలహదారులుగా తాత్కాలిక ప్రభుత్వంలో భాగమయ్యారు. వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసిన తరువాతే ఎన్నికలు నిర్వహించాలని పట్టుబడుతున్నారు.
సంస్కరణలు పూర్తయిన తరువాత వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో ఎన్నికలు నిర్వహించాలని యూనస్ ముందుగా సూచించారు. కానీ ఇది సంవత్సరాంతానికి ఎన్నికలు నిర్వహించాలని పట్టుబట్టిన బీఎన్పీతో ఐడియాకు విరుద్దంగా ఉండటంతో రెండు వర్గాల మధ్య ఘర్షణాత్మక వైఖరి ప్రారంభం అయింది.
బీఎన్పీ మొదట్లో యూనస్ సంస్కరణలకు మద్దతు ఇచ్చింది. కానీ ఈ ప్రక్రియ ఎన్నికలను ఆలస్యం చేయకూడదని, మిగిలిన సంస్కరణను ఎన్నికైన ప్రభుత్వం చేయవచ్చని వాదించింది. ఇటీవల వారాల్లో బీఎన్పీ, విద్యార్థి నాయకుల మధ్య సంబంధం దెబ్బతింది. వారు క్రమం తప్పకుండా మాటల దాడులకు దిగారు.
ముందంజలో బీఎన్పీ..
అవామీ లీగ్ తరువాత రెండవ అతిపెద్ద పార్టీ బీఎన్పీ. ఎన్నికలలో ఇది ఇతర పార్టీల కంటే ముందుంది. హసీనా ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధం విధించడంతో తానే విజేతగా బీఎన్పీ భావిస్తోంది. బంగ్లాదేశ్ లో అధికారంలోకి వస్తామనే ధీమా దానిలో ఉంది.
యూనస్ సంస్కరణలు ఎన్నికలను మరింత ఆలస్యం చేస్తున్నాయి. ఇది బీఎన్పీని ఆందోళనకు గురి చేసింది. ఈ పరిణామం రెండు వర్గాల మధ్య ఘర్షణలకు దారితీసింది. ఎన్నికలు ఆలస్యం కావడం, అధికారంలో దాదాపు రెండు దశాబ్ధాలుగా లేకపోవడంతో వారి కార్యకర్తలు అశాంతితో ఉన్నారు.
హసీనా బహిష్కరణ తరువాత అవినీతి, పార్టీ అంతర్గత ఘర్షణలకు దారితీసిన లాభదాయకమైన , డబ్బు సంపాదించే సంస్థలను బీఎన్పీ కార్యకర్తలు ఆక్రమించారు.
దాని ప్రతిష్ట మసకబారుతుందనే భయం, ప్రజలు దానిని అవామీ లీగ్ తో సమానంగా చూస్తారనే భయం బీఎన్పీ నాయకుల్లో ఉంది. దీనివల్ల పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని ఎన్నికల్లో అధికారంలోకి రామని భయపడుతున్నారు. పార్టీ పేరుతో అవినీతి చేస్తున్న పలువురిని ఇప్పటికే నాయకత్వం బహిష్కరించింది.
ఇది విద్యార్థులకు మరో అవకాశంలా కనిపిస్తోంది. హసీనా లాగా బీఎన్పీ కూడా అవినీతి పద్దతులకు కేంద్రంగా మారిందని పలువురు విద్యార్థి నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రజల్లో ప్రచారం చేస్తున్నారు.
యూనస్ - తారిక్ సమావేశంలో ఎన్నికల తేదీపై అవగాహనకు అంగీకరించడమే కాకుండా యూనస్ విద్యార్థులు, బీఎన్పీ మధ్య శాంతి నెలకొల్పడానికి కూడా ప్రయత్నించారు. అయితే ఇవి ఏ మేరకు విజయం సాధించారో ఇంకా స్పష్టంగా తెలియలేదు.
అదుపులోని శాంతి భద్రతలు
ఫిబ్రవరి ఎన్నికలపై బీఎన్పీ, యూనస్ తమ మద్దతదారులను అంగీకరించేలా ఒప్పించగలిగినప్పటికీ శాంతిభద్రతల పరిస్థితి ఇప్పటికి ఒక ముఖ్యమైన సవాల్ గా ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు.
గత సంవత్సరం జూలైలో జరిగిన నిరసనల నుంచి శాంతి భద్రతలు అదుపులో లేకుండా ఉన్నాయి. చాలామంది పోలీసులు తిరిగి విధుల్లోకి చేరినప్పటికీ వారికి ఒకప్పటి ఆత్మవిశ్వాసం, అధికారం వారికి లేదు. ప్రస్తుతం సైన్యంమే శాంతిభద్రతలను కాపాడుతోంది. అలాగే పట్టణాలలో పెరుగుతున్న నేరాల సంఖ్యను కూడా ఎదుర్కోవడం దానితరం కావడం లేదు.
ఎన్నికలు అధికారికంగా ప్రకటించిన తరువాత ఇటువంటి నేరాలు, రాజకీయ ప్రత్యర్థుల మధ్య ఘర్షణలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఎన్నికల సమయంలో శాంతిని కాపాడటంలో సైన్యం దే కీలకపాత్ర.
భారత్- బీఎన్పీ సంబంధాలు..
ఢాకాలో బీఎన్పీ నేతృత్వంలోని ప్రభుత్వంతో భారత అనుభవం ఏమాత్రం ఆశాజనకంగా లేదు. ముఖ్యంగా భారత వ్యతిరేకత, మతోన్మాదం ప్రదర్శించే జమాతే- ఇ- ఇస్లామీతో ఆ పార్టీకి గతంలో ఉన్న అనుబంధం కారణంగా రెండింటి సంబంధాలు కుదరడం లేదు.
ప్రస్తుతం జమాత్ తో ఒక అవగాహన విఫలమైతే బీఎన్పీ కొన్ని ఇస్లామిక్ పార్టీలను సంకీర్ణ భాగస్వాములుగా తీసుకురావాలని చూస్తుందని నివేదికలు సూచిస్తున్నాయి.
ఇస్లామిక్ పార్టీల విస్తృత సంకీర్ణాన్ని ఏర్పాటు చేసి బంగ్లాదేశ్ ను ఇస్లామిక్ స్టేట్ గా మార్చే దిశగా ప్రయత్నాలు చేస్తున్న జమాత్ ప్రభుత్వంలో చేరడానికి ఆసక్తి చూపకపోవచ్చు.
జమాత్ లేకుండా ఢాకాలో బీఎన్పీ ప్రభుత్వం ఏర్పడితే భారత్ కు ఆమోదయోగ్యంగా ఉండవచ్చు. ముఖ్యంగా హసీనా రాజకీయ భవిష్యత్ అనిశ్చితంగా ఉన్నప్పుడు పరిస్థితులు ఎలా మారతాయనే దాని బీఎన్పీ ఇతరులు భవిష్యత్ లో ఏర్పరచుకునే పొత్తులు ఆధారపడి ఉన్నాయి.
ఎన్నికలు ప్రకటించిన తరువాత భారత్ తో అతిపెద్ద సరిహద్దు పంచుకునే దేశంలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. కానీ ఇతరులు కూడా అలాగే ఉంటారు. హసీనా నిష్క్రమణ ఈ ప్రాంతంలో అంతకుమించి బంగ్లాదేశ్ పట్ల ఆసక్తిని పెంచింది.
(ఫెడరల్ అన్ని వైపుల నుంచి అభిప్రాయాల, అభిప్రాయాలను అందించడానికి ప్రయత్నిస్తుంది. వ్యాసంలోని సమాచారం, ఆలోచనలు లేదా అభిప్రాయాలు రచయితవి. అవి ఫెడరల్ అభిప్రాయాలను ప్రతిబింబిచవు)
Tags:    

Similar News