రష్యా అధ్యక్షుడు పుతిన్ జోక్యం చేసుకుంటారా?
ఇరాన్లోని మూడు అణు కేంద్రాలపై అమెరికా వైమానికి దాడులు చేసిన నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి మధ్య సంభాషణలు జరుగుతాయన్న వార్తలొచ్చాయి. అయితే అలాంటిదేమీ ఇప్పట్లో లేదని
రష్యా అధ్యక్ష భవనం నుంచి అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ స్పష్టం చేశారు. అవసరం అనుకున్నప్పుడు ఫోన్ కాల్ ఏర్పాటు చేయడం పెద్ద కష్టమేమీ కాదన్నారు.
ఇరాన్పై జరుగుతున్న దాడులపై రష్యా విదేశాంగ వ్యవహారాల కమిటీ చైర్మన్ లియోనిడ్ స్లుట్స్కీ అమెరికాపై ఘాటుగా స్పందించారు. యుద్ధం పూర్తిగా రాజకీయదురుద్దేశంతో కూడుకున్నదని విమర్శించారు. ఇరాన్లో పాలన మార్చాలనే కుట్రలో ట్రంప్ భాగమైనట్టే కనిపిస్తోందన్నారు. అయితే అమెరికా దాడులతో ఇరాన్ వెనక్కి తగ్గదని రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వెదెవ్ అన్నారు. "మూడు అణు కేంద్రాలపై దాడి చేసి అమెరికా ఏం సాధించింది? అని ప్రశ్నించారు.