ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్‌కి ప్రధాని మోదీ ఫోన్..

ఇరాన్ భూగర్భ అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేసిన కొన్ని గంటల తర్వాత.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్‌తో ఫోన్లో మాట్లాడారు. 45 నిమిషాల పాటు ఇద్దరి మధ్య సంభాషణలో ప్రస్తుత పరిస్థితి గురించి ఇరాన్ అధ్యక్షుడు ప్రధానికి వివరించినట్లు సమాచారం.

"ఇరాన్ అధ్యక్షుడు @drpezeshkian తో మాట్లాడాను. ప్రస్తుత పరిస్థితి గురించి మేము వివరంగా చర్చించాము. ఇటీవలి ఉద్రిక్తతలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసాము. ప్రాంతీయ శాంతి, భద్రత మరియు స్థిరత్వాన్ని త్వరగా పునరుద్ధరించడానికి మరియు ముందుకు సాగడానికి తక్షణ ఉద్రిక్తతలను తగ్గించడం, సంభాషణ మరియు దౌత్యం కోసం మా పిలుపును పునరుద్ఘాటించాము" అని ప్రధాని మోదీ X లో రాశారు.

‘‘ఇరాన్ అధ్యక్షుడు @drpezeshkian గారితో మాట్లాడాను. ప్రస్తుత పరిస్థితులపై విస్తృతంగా చర్చించాం. ఉద్రిక్తతలు తగ్గించుకోవడం, ఇరు దేశాలు చర్చించుకుని సమస్య పరిష్కరించుకోవడం ఎంత ముఖ్యమో మసౌద్‌కు సలహా ఇచ్చాను.’’ అని ప్రధాని ఎక్స్‌లో పోస్టు చేశారు.

ఇరాన్‌పై అమెరికా దాడి..

ఇరాన్ అణు కార్యక్రమాలను నిర్వీర్యం చేసేందుకు ఇజ్రాయెల్ చేస్తున్న ప్రయత్నంలో అమెరికా జోక్యం చేసుకుని ఇరాన్‌లోని మూడు ప్రాంతాలపై అగ్రరాజ్యం వైమానిక దాడులు చేసింది. ఫోర్డో, ఇస్ఫహాన్, నటాంజ్ అణు కేంద్రాలపై దాడులకు తెగబడింది.

ఇందుకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ తీవ్రంగా హెచ్చరించింది. ఇక దౌత్యానికి ఎల్లప్పుడూ తలుపులు తెరిచి ఉంచుతామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి పేర్కొన్నారు.

పశ్చిమాసియా దేశాలతో (ఇరాక్, జోర్డాన్, లెబనాన్, సిరియా, యెమెన్) భారతదేశానికి విస్తృత వాణిజ్య సంబంధాలున్నాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో ఇరాన్‌కు భారతదేశం ఎగుమతులు $1.24 బిలియన్లుగా ఉన్నాయి. వీటిలో బాస్మతి బియ్యం ($753.2 మిలియన్లు), అరటిపండు ($53.2 మిలియన్లు), సోయా మీల్ ($70.6 మిలియన్లు), బెంగాల్ పప్పు ($27.9 మిలియన్లు) టీ ($25.5 మిలియన్లు) ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో దిగుమతులు $441.8 బిలియన్లుగా ఉన్నాయి.

Update: 2025-06-22 11:37 GMT

Linked news