ఇరాన్ అణుకేంద్రాలను మట్టుబెట్టాం: ట్రంప్
తమ దేశం మూడు ఇరానియన్ అణు కేంద్రాలు - ఫోర్డో, నటాంజ్, ఎస్ఫహాన్ - ఫోర్డోలోని అణు కేంద్రాలపై విజయవంతంగా దాడులు నిర్వహించిందని అమెరికా (America) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తెలిపారు. దాడుల తర్వాత ట్రంప్ మాట్లాడుతూ ఇరాన్లోని అణు కేంద్రాలను పూర్తిగా తుడిచిపెట్టామని చెప్పారు. అయితే ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి ఈ దాడులను ఖండించారు. "ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఉన్న అమెరికా ఇరాన్ అణు కేంద్రాలపై దాడి చేయడం ద్వారా అంతర్జాతీయ చట్టం NPT ఉల్లంఘనకు పాల్పడింది.’’ అని పేర్కొన్నారు.
అమెరికా దాడుల తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్పై క్షిపణుల దాడిని ప్రయోగించింది. టెల్ అవీవ్తో సహా దేశంలోని వివిధ ప్రాంతాలలో అనేక పేలుళ్లు సంభవించాయని ఇజ్రాయెల్ మీడియా నివేదించింది. పశ్చిమ ఇరాన్లోని క్షిపణి లాంచర్లు సహా సైనిక లక్ష్యాలపై తాజాగా దాడులు ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ సైన్యం కూడా తెలిపింది.
ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం ప్రారంభమైన వారం తర్వాత శుక్రవారం (జూన్ 20, 2025) ఇరు దేశాల మధ్య దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో కీలక యూరోపియన్ మంత్రులు జెనీవాలో ఇరాన్ ఉన్నత దౌత్యవేత్తతో సమావేశమై వివాదాన్ని తగ్గించడానికి ప్రయత్నించారు. కానీ వారం రోజుల పాటు జరిగిన యుద్ధంలో పాశ్చాత్య, ఇరానియన్ అధికారుల మధ్య జరిగిన మొదటి ముఖాముఖి సమావేశం 4 గంటల తర్వాత తక్షణ పురోగతికి సంకేతాలు లేకుండా ముగిసింది.