సీఎం జగన్, విడదల రజనీపై కేసు నమోదు ఆంధ్రలో... ... ఆంధ్ర పోలింగ్.. లైవ్ అప్‌డేట్స్..

సీఎం జగన్, విడదల రజనీపై కేసు నమోదు

ఆంధ్రలో ఒకవైపు పోలింగ్ జరుగుతున్నప్పటికీ సీఎం జగన్, విడదల రజనీ పేరుతో ఐవీఆర్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేయాలని కాల్స్‌లో కోరడంపై గుంటూరు పశ్చిమనియోజకవర్గం ఓటర్లు, టీడీపీ నేతలు దేవినేని ఉమ, పంచుమర్తి అనురాధ.. ఈసీకి ఫిర్యాదు చేశాయి. వారి ఫిర్యాదులను స్వీకరించిన ఈసీ.. పోలీసులను పలు ఆదేశాలు జారీ చేసింది. ఈసీ ఆదేశాల మేరకు మంగళగిరి పోలీసులు.. జగన్, విడదల రజనీపై కేసు నమోదు చేశారు. ఐసీపీలోని 188, 171ఎఫ్, 171హెచ్, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 123, 126, 130 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Update: 2024-05-13 11:17 GMT

Linked news