సూళ్లూరుపేటలో లాటిఛార్జ్నెల్లూరు జిల్లా... ... ఆంధ్ర పోలింగ్.. లైవ్ అప్‌డేట్స్..

సూళ్లూరుపేటలో లాటిఛార్జ్

నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట అసెంబ్లీ స్థానం పరిధిలోని నాయుడుపేట మండలం అన్నమేడు గ్రామంలో టిడిపి, వైఎస్ఆర్సిపి మద్దతుసారులు పరస్పరం దాడులు చేసుకున్నారు. పరిస్థితి అదుపు తప్పుతోందని గ్రహించిన ఎస్సై గోపీనాథ్ వారిపై లాఠీ ఛార్జ్ చేశారు. ఇదే సమయంలో వృద్ధ మహిళ అని కూడా చూడకుండా ఇంటి బయట కూర్చుని వున్న జులేఖాభి (70) పై కూడా లాఠీ తో కొట్టడంతో, ఆమె తలకు బలమైన గాయమైంది. వృద్ధురాలిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. వృద్ధురాలనే కనికరం లేకుండా ఎస్సై ప్రవర్తించిన తీరుతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Update: 2024-05-13 08:56 GMT

Linked news