బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం నాచారం... ... ఆంధ్ర పోలింగ్.. లైవ్ అప్డేట్స్..
బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం
నాచారం డివిజన్లోని భవాని నగర్లో బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. బీజేపీ ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ పార్టీ కండువాతో పోలింగ్ బూత్ వద్ద బైఠాయించి తమ పార్టీ అభ్యర్థికే ఓటు వేయాలని ఓటర్లను కోరడం ప్రచారం కొనసాగిస్తున్నారు. అది గమనిచిన స్థానిక కాంగ్రెస్ నాయకులు ఆయన చర్యలను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విషయమై ఇరు పార్టీల నేతలపై వాగ్వాదం జరిగింది. పోలీసుల జోక్యంతో వాగ్వాదం పెద్దది కాకుండా సర్దుమణిగింది. అనంతరం మాజీ ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు.
నాచారం డివిజన్లోని భవాని నగర్లో బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. బీజేపీ ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ పార్టీ కండువాతో పోలింగ్ బూత్ వద్ద బైఠాయించడమే ఇందుకు కారణం.#BJP #Congress pic.twitter.com/63qIIePpyc
— Subbu (@Subbu15465936) May 13, 2024