Tirumala || యూపీఐ ద్వారా పేమెంట్‌ చేసి లడ్డూలు పొందే అవకాశం
x

Tirumala || యూపీఐ ద్వారా పేమెంట్‌ చేసి లడ్డూలు పొందే అవకాశం

లడ్డూల కోసం ఇకపై క్యూ కట్టాల్సిన పని లేదు


తిరుమల శ్రీవారి లడ్డూ కౌంటర్‌లో టీటీడీ కియోస్క్‌ మిషన్లను ఏర్పాటు చేసింది. అన్నప్రసాదం ట్రస్టుకు రూపాయి నుంచి రూ.99 వేల వరకు భక్తులు సులభంగా విరాళాలు అందజేసేలా టీటీడీ తొలుత ఈ కియోస్క్‌ మిషన్లను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.


ఈ క్రమంలో లడ్డూలకూ విస్తరించి, ఐదు కియోస్క్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. దర్శన టికెట్లు, టోకెన్లపై ఉండే నెంబరును భక్తులు ఈ కియోస్క్‌లో నమోదు చేసి లడ్డూల సంఖ్యను ఎంపిక చేసుకోవాలి.


10 నుంచి 15 లడ్డూల వరకు పొందవచ్చు. ఆ తర్వాత కనిపించే కోడ్‌ను భక్తులు తమ మొబైల్‌ ద్వారా స్కాన్‌ చేసి పేమెంట్‌ చేస్తే ఓ రసీదు వస్తుంది. దాంతో నేరుగా కౌంటర్‌ వద్దకు వెళ్లి లడ్డూలు పొందవచ్చు. ఎలాంటి దర్శన టోకెన్లు, టికెట్లు లేని భక్తులైతే తమ ఆధార్‌ నెంబరును నమోదు చేసి రెండు లడ్డూలు పొందవచ్చు.


లడ్డూల నిల్వ, రద్దీని బట్టి ఈ సంఖ్య మారుతుంటుంది. కొద్ది రోజులు ఈ విధానాన్ని కొనసాగించి లోటుపాట్లను సరిచేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.


Read More
Next Story